Movie News

ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ సాహసం ?

గత ఏడాది అనుష్క ఘాటీ రూపంలో దర్శకుడు క్రిష్ చాలా చేదు అనుభవాన్ని ఎదురుకున్నారు. కనీసం యావరేజ్ అయినా ఊరట దక్కేది కానీ డిజాస్టర్ కావడంతో డిఫెండ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చాలదు అన్నట్టు పాక్షికంగా డైరెక్ట్ చేసిన హరిహర వీరమల్లు కూడా ఇదే దారి పట్టడం గాయాన్ని మరింత పెద్దది చేసింది.

ఒకప్పుడు గమ్యం, వేదం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి క్లాసిక్స్ ఇచ్చిన ఫిలిం మేకర్ ఇలా డౌన్ ఫేజ్ లో ఉండటం మూవీ లవర్స్ ని బాధ పెడుతోంది. అందుకే బలమైన సబ్జెక్టు కోసం క్రిష్ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. అయితే ఈసారి వ్యవహారం ఆషామాషీగా ఉండటం లేదట.

ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు హీరోయిన్లు ఇందులో నటించబోతున్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు కానీ క్రిష్ ప్రస్తుతం ఆ క్యాస్టింగ్ పనిలోనే ఉన్నారు. ట్రెక్కింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి.

ఇంతకన్నా వివరాలు ప్రస్తుతానికి లీక్ కాలేదు కానీ క్రిష్ మాత్రం గట్టిగానే హోమ్ వర్క్ చేస్తున్నారట. మారిపోతున్న ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా అప్డేట్ కావడం నిన్నటి దర్శకులకు పెద్ద సవాల్ గా మారింది. పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి బ్లాక్ బస్టర్ మేకర్లు సైతం ఈ విషయంలో ఎదురీదుతున్న సంగతి తెలిసిందే.

అయితే క్రిష్ వేరుగా ఉండటానికి కారణం ఆయన రెగ్యులర్ లీగ్ లో సినిమాలు తీయరు. రొటీన్ అనిపించే సబ్జెక్టులు రాసుకోరు. ఆ కారణంనే ఎన్టీఆర్ బయోపిక్ ని ఏరికోరి మరీ క్రిష్ చేతికి ఇచ్చారు బాలకృష్ణ. రిజల్ట్ అనుకున్నట్టు రాలేదు కానీ బ్యాడ్ మూవీ అయితే అనిపించుకోలేదు.

ఇంతకీ ఏడుగురు భామలతో క్రిష్ ఎలాంటి ప్రయోగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తనదైన స్టయిల్ కొనసాగిస్తూనే కొత్త తరహా స్క్రీన్ ప్లే రాసుకున్నారని తెలిసింది. త్వరలో అనౌన్స్ మెంట్ రావొచ్చు. సోలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న క్రిష్ కు తాను కోరుకున్న విజయం ఏడుగురు హీరోయిన్లతో అయినా దక్కుతుందేమో చూడాలి.

This post was last modified on February 12, 2026 1:57 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Krish

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

42 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago