పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగల కలయికలో రూపొందుతున్న స్పిరిట్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కొత్త హీరో విజయ్ దేవరకొండతో తీసిన తన తొలి చిత్రం అర్జున్ రెడ్డితోనే సందీప్ ఎలా ప్రకంపనలు రేపాడో తెలిసిందే. తర్వాత బాలీవుడ్లో షాహిద్ కపూర్, రణబీర్ కపూర్లతో వారి మార్కెట్ స్థాయికి మించి చాలా పెద్ద హిట్లే ఇచ్చాడు.
అలాంటి దర్శకుడు ప్రభాస్ లాంటి సూపర్ స్టార్తో సినిమా చేస్తుండడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చూడబోతున్నామనే అంచనాలతో అందరూ ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న కాస్టింగ్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తించింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ను కీలక పాత్రకు తీసుకోవడం చర్చనీయాంశం అయింది.
గత ఏడాది ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఆడియో గ్లింప్స్లో ప్రభాస్తో పాటు ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా వినిపించింది. ఈ ఇద్దరి సంభాషణ సినిమాపై అంచనాలు పెంచింది.
ఐతే చిత్రీకరణ ఆరంభ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ప్రకాష్ రాజ్ తప్పుకొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రకాష్ రాజ్ ఈ చిత్రం నుంచి వైదొలిగాడట. సందీప్ రెడ్డి ఆలోచనలు చాలా బోల్డ్గా, వైల్డ్గా ఉంటాయన్న సంగతి తెలిసిందే.
కొన్ని సీన్లు పచ్చిగా తీస్తాడు. డైలాగ్స్ కూడా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. మరి ప్రకాష్ రాజ్కు ఏ విషయంలో అభ్యంతరాలున్నాయో కానీ.. ఈ సినిమాలో తాను కొనసాగలేనని ఆయన బయటికి వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
యాటిట్యూడ్ చూపించే ఆర్టిస్టులతో సందప్ రెడ్డి ఎలా వ్యవహరిస్తాడో.. దీపికా పదుకొనే వ్యవహారమప్పుడే అందరికీ అర్థమైంది. ముందుగా ఈ చిత్రానికి ఆమెనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె పెట్టిన కండిషన్లతో తనను తప్పించి త్రిప్తి దిమ్రిని కథానాయికగా ఎంచుకున్నాడు సందీప్.
దీపిక లాగే ప్రకాష్ రాజ్ యాటిట్యూడ్ గురించి కూడా ఇండస్ట్రీలో తరచుగా చర్చ జరుగుతుంటుంది. మరి సందీప్, ప్రకాష్ రాజ్లకు ఏ విషయంలో విభేదాలు వచ్చాయో.. ప్రకాష్ రాజ్ స్థానంలో ఇంకెవరిని సందీప్ ఎంచుకుంటాడో చూడాలి మరి.
This post was last modified on February 8, 2026 7:49 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…