నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి మైలేజ్ ఇచ్చింది. స్వప్న సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 25 విడుదల కానుంది. పెళ్లి సందడితో డెబ్యూ చేసిన రోషన్ మేక చాలా గ్యాప్ తీసుకుని తన రెండో మూవీతో వస్తున్నాడు. వైజయంతి సంస్థ బ్యాకప్ కావడంతో మంచి సపోర్ట్ తో థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే సాధారణ ప్రేక్షకులకు దీని గురించి తెలిసింది తక్కువే. అందుకే సోషల్ మీడియా అటెన్షన్ తెచ్చేందుకు చరణ్ హాజరు తీసుకోవడం అంచనాల పరంగా చాలా ప్లస్ కానుంది.
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత చరణ్ పెద్దగా పబ్లిక్ ఈవెంట్స్ కి వస్తున్న దాఖలాలు తక్కువ. పెద్దిలో బిజీ అయిపోవడంతో దాని మీదే దృష్టి పెడుతున్నాడు. అయితే ఛాంపియన్ కోసం రావడం వెనుక కారణముంది. మొదటిదిది తన డెబ్యూ మూవీ చిరుత తీసింది ఫ్యామిలీకి ఎంతో దగ్గరైన నిర్మాత అశ్వినీదత్. పైగా స్వప్న, ప్రియాంకలతో కూడా ఫ్రెండ్ షిప్ ఉంది. రెండోది చిరంజీవికి బాగా ఇష్టుడైన శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో కావడం. గోవిందుడు అందరివాడేలేలో చరణ్ బాబాయ్ గా శ్రీకాంత్ కనిపించిన సంగతి తెలిసిందే. మాట్లాడిన కాసేపే అయినా తన ప్రసంగం ఆకట్టుకునేలా సాగింది. రోషన్ కు ఛాంపియన్ మరో మగధీర అవ్వాలని చెప్పాడు.
దత్తుగారితో ఉన్న అనుబంధం, తనలాంటి వ్యక్తులను నిజంగా నటులో కాదో చూసుకోకుండా ఎందరినో పరిచయం చేసి గొప్ప పునాది వేసిన ఉదంతాన్ని వివరించాడు. హీరోయిన్ అనస్వర రాజన్ గురించి గొప్పగా చెబుతూ ఇకపై టాప్ డైరెక్టర్స్, బ్యానర్స్ నుంచి అవకాశాలు వస్తాయని పొగడటంతో ఆ అమ్మాయి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. శ్రీకాంత్ తో బాండింగ్ గురించి కూడా వివరించిన చరణ్ పెద్ది రిలీజ్ డేట్ మరోసారి మార్చి 27 కన్ఫర్మ్ చేశాడు. అప్డేట్స్ అడగొద్దని, సంక్రాంతి హడావిడి అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం తీసుకుని దూరిపోతామని సరదాగా తేల్చేశాడు. వచ్చే వారం ఛాంపియన్ ఏం చేస్తుందో చూడాలి మరి.
This post was last modified on December 19, 2025 12:03 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…