మాస్ జాతర విడుదల నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఊహించని విధంగా బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురు కావడం ఇబ్బందికర పరిణామమే అయినా ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో నిర్మాత నాగవంశీ ప్రొసీడ్ అవుతున్నారు. అయితే మొదట చెప్పిన డేట్ అక్టోబర్ 31 రెగ్యులర్ షోలు వేయకుండా కేవలం సాయంత్రం నుంచి స్పెషల్ ప్రీమియర్లతో ఆటలు మొదలుపెట్టడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అంటే ఆన్ రికార్డ్ మాస్ జాతర రెగ్యులర్ విడుదల తేదీ నవంబర్ 1 అవుతుంది. సరే వినడానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడీ ప్రీమియర్ల మీద చాలా పెద్ద బరువే ఉంది.
గత కొన్నేళ్లుగా రవితేజ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేసిన దాఖలాలు చాలా తక్కువ. గత ఏడాది మిస్టర్ బచ్చన్ కు ఆ రిస్క్ తీసుకున్నారు కానీ ఆ నిర్ణయమే నిలువునా ముంచేసిందని అభిమానులు వాపోయారు. కంటెంట్ తేడా ఉండటం పక్కనపెడితే రాత్రికి రాత్రి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ కావడం వాళ్ళను నిరాశ పరిచింది. దీనికి ముందు ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర తదితర సినిమాలకు దేనికీ ముందు రోజు షోలు వేయలేదు. వాల్తేరు వీరయ్య కూడా తెల్లవారుఝాము నుంచి మొదలుపెట్టారు. సో మాస్ జాతర ఈ రకంగా చూసుకుంటే పెద్ద అడ్వెంచర్ చేస్తోంది. ప్రొడ్యూసర్ కున్న కాన్ఫిడెన్స్ ఇది.
బుక్ మై షోలో మాస్ జాతర హైదరాబాద్ బుకింగ్స్ మొదలుపెట్టారు. ఇంకా ట్రెండింగ్ లోకి రాలేదు. పూర్తిగా సోల్డ్ అవుట్ అయిన షో గంటల తర్వాత కూడా లేదు. స్లోగా ఆరంజ్ కలర్ లోకి మారుతోంది. ట్రైలర్ కు ఎక్స్ ట్రాడినరి రెస్పాన్స్ రాకపోవడం ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. టీమ్ లెక్క వేరుగా ఉంది. పైకి రొటీన్ కథలా కనిపించినా థియేటర్ లో ఊహించని చాలా ఎలిమెంట్స్ సర్ప్రైజ్ చేస్తాయని, వాటిని రివీల్ చేయకుండా తీసుకున్న జాగ్రత్తల వల్ల కొంచెం హైప్ తగ్గినట్టు అనిపించినా 31 అర్ధరాత్రి సమయానికి టాక్ లెక్కలు మారిపోతాయని ధీమాగా ఉంది. చూడాలి మరి ఇంత బరువుని ఎలా మోస్తుందో.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…