నటకిరీటి రాజేంద్రప్రసాద్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఏముందో తాను చెప్పనని, ఒకవేళ చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని వేలాది మంది సమక్షంలో పబ్లిక్ గా శపథం చేశారు. మాములుగా రిలీజులకు ముందు అందులో నటించిన క్యాస్టింగ్ ఇలాంటి ప్రామిసులు చేయడం సహజం. గతంలో కొందరు యూత్ హీరోలు తమ సినిమా హిట్ కాకపోతే పేర్లు మార్చుకుంటామని, ఇంకేదేదో చేస్తామని అన్నవాళ్ళు లేకపోలేదు. కాకపోతే వాళ్లలో ఏ ఒక్కరు మాట మీద నిలబడలేదు. జస్ట్ ప్రమోషన్ల కోసం వేసుకున్న స్ట్రాటజీలో అలా మాట్లాడేస్తారు.
నిజంగా మాస్ జాతర బాగుండొచ్చు. అదేదో హిట్టయ్యాక నేను ఇది ఆడకపోతే పరిశ్రమకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నా అని రాజేంద్రప్రసాద్ అని ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంత పెద్ద మాట అనేసరికి అక్కడున్న వాళ్ళు ఒక్క క్షణం ఏంటి ఈయన నమ్మకం అని ఆశ్చర్యపోయారు. ఇలా కామెంట్స్ ద్వారా వార్తల్లో నిలవడం రాజేంద్రప్రసాద్ కు కొత్త కాదు. ఆ మధ్య రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ మీద వేసిన జోకులు, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీ మీద చేసిన హాస్యం లాంటివి మిస్ ఫైర్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతర వేడుకలో మరొకటి.
ఏది ఏమైనా ఇలాంటి సందర్భాల్లో రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్లు చాలా సంయమనంతో ఉండాలి. వదిలేసి వెళ్తా అని చెప్పడం ఈజీనే. కానీ ఒక బిజీ ఆర్టిస్టుగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ లు పెడుతున్న సినిమాల్లో ఈయన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంత తేలిగ్గా అనేస్తే లేనిపోని ట్రోలింగ్ ను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. మాస్ జాతరలో రాజేంద్రుడు హీరో రవితేజకు తాతయ్యగా నటించారు. వీళ్లిద్దరి బాండింగ్, ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్ ఉంది. బహుశా ఆ ఎగ్జైట్ మెంట్ లో ఇలా అనేశారేమో కానీ ఆయన పోతా అన్నా టాలీవుడ్, అభిమానులు అంత ఈజీగా వదలరు లెండి.
This post was last modified on October 28, 2025 10:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…