నటకిరీటి రాజేంద్రప్రసాద్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఏముందో తాను చెప్పనని, ఒకవేళ చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని వేలాది మంది సమక్షంలో పబ్లిక్ గా శపథం చేశారు. మాములుగా రిలీజులకు ముందు అందులో నటించిన క్యాస్టింగ్ ఇలాంటి ప్రామిసులు చేయడం సహజం. గతంలో కొందరు యూత్ హీరోలు తమ సినిమా హిట్ కాకపోతే పేర్లు మార్చుకుంటామని, ఇంకేదేదో చేస్తామని అన్నవాళ్ళు లేకపోలేదు. కాకపోతే వాళ్లలో ఏ ఒక్కరు మాట మీద నిలబడలేదు. జస్ట్ ప్రమోషన్ల కోసం వేసుకున్న స్ట్రాటజీలో అలా మాట్లాడేస్తారు.
నిజంగా మాస్ జాతర బాగుండొచ్చు. అదేదో హిట్టయ్యాక నేను ఇది ఆడకపోతే పరిశ్రమకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నా అని రాజేంద్రప్రసాద్ అని ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంత పెద్ద మాట అనేసరికి అక్కడున్న వాళ్ళు ఒక్క క్షణం ఏంటి ఈయన నమ్మకం అని ఆశ్చర్యపోయారు. ఇలా కామెంట్స్ ద్వారా వార్తల్లో నిలవడం రాజేంద్రప్రసాద్ కు కొత్త కాదు. ఆ మధ్య రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ మీద వేసిన జోకులు, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీ మీద చేసిన హాస్యం లాంటివి మిస్ ఫైర్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతర వేడుకలో మరొకటి.
ఏది ఏమైనా ఇలాంటి సందర్భాల్లో రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్లు చాలా సంయమనంతో ఉండాలి. వదిలేసి వెళ్తా అని చెప్పడం ఈజీనే. కానీ ఒక బిజీ ఆర్టిస్టుగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ లు పెడుతున్న సినిమాల్లో ఈయన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంత తేలిగ్గా అనేస్తే లేనిపోని ట్రోలింగ్ ను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. మాస్ జాతరలో రాజేంద్రుడు హీరో రవితేజకు తాతయ్యగా నటించారు. వీళ్లిద్దరి బాండింగ్, ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్ ఉంది. బహుశా ఆ ఎగ్జైట్ మెంట్ లో ఇలా అనేశారేమో కానీ ఆయన పోతా అన్నా టాలీవుడ్, అభిమానులు అంత ఈజీగా వదలరు లెండి.
This post was last modified on October 28, 2025 10:21 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…