సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోబోతున్నట్టు వచ్చిన వార్త చెన్నై మీడియాని కుదిపేస్తోంది. ఆయనేమీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇన్ సైడ్ లీక్స్ నుంచి వచ్చిన సమాచారం పక్కాగా ఉండటంతో క్షణాల్లో ఇది వైరల్ గా మారిపోయింది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సుందర్ సి దర్శకత్వంలో ఒకటి నవంబర్ ఏడున ప్రకటిస్తారట. మరొకటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్ నటించబోయే మల్టీస్టారర్. జైలర్ 2 రిలీజయ్యాక నెల్సన్ ఈ పని మీదే ఉంటాడట. మరి జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్న మూవీ ఇంకొంచెం లేట్ అవుతుందేమో.
ఒకవేళ ఇది నిజమైతే రజనీకాంత్ విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ఆయనకు మంచిదే. ఇప్పటికే ఏడు పదుల వయసులోనూ అభిమానుల కోసం చాలా కష్టపడుతున్నారు. రోబో షూటింగ్ టైంలో తీవ్ర అనారోగ్యానికి గురై పలుమార్లు చికిత్స తీసుకోవాల్సి వచ్చినా తట్టుకుని మరీ యాక్టింగ్ కొనసాగిస్తున్నారు. జైలర్ బ్లాక్ బస్టర్ ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కూలి అంచనాలు అందుకోలేకపోయినా అయిదు వందల కోట్ల గ్రాస్ దాటడం మాములు విషయం కాదు. రజని స్టామినా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని ఇలాంటి ఫలితాలు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటాయి.
రజని ఏజ్ దృష్ట్యా ఇప్పుడు ఫైనల్ గా కమిట్ అవుతున్న సినిమాలు రెండూ పూర్తి చేయడానికి 2027 దాకా టైం పట్టొచ్చు. అయితే బి గ్రేడ్ హారర్ సినిమాలు తీస్తున్న సుందర్ సికి అవకాశం ఎందుకిచ్చారనేది చాలా మంది మూవీ లవర్స్ మెదడుని తొలిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సుందర్ సి కెరీర్ మొత్తంలో గర్వంగా చెప్పుకునే సూపర్ హిట్ మూవీ అరుణాచలం. ఆ తర్వాత రజనితో మరోసారి పని చేయలేదు కానీ తలైవర్ తో అనుబంధం అలాగే కొనసాగిస్తున్నారు. ఆ చనువుతోనే సుందర్ సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. సో కోలీవుడ్ సూపర్ స్టార్ ని తెరమీద ఇంకో రెండుసార్లే చూస్తామన్న మాట.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…