మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ దసరా మిస్ చేసుకున్నా దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దీని కోసమే మన శంకరవరప్రసాద్ గారు మీసాల పిల్లని సందర్భం లేకపోయినా హఠాత్తుగా రిలీజ్ చేశారు. తాజా ట్విస్ట్ ఏంటంటే పండక్కు పెద్ది పాట రాకపోవచ్చు. ప్రస్తుతం దీని షూటింగే జరుగుతోంది. ఇంకా రీ రికార్డింగ్, కలర్ కరెక్షన్, మిక్సింగ్ లాంటి చాలా పనులున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఆయనేమో చాలా బిజీగా ఉన్నాడు. కొంచెం టైం ఇమ్మని అడిగాడని సమాచారం.
ఎలాగూ వచ్చే నెల హైదరాబాద్ లో రెహమాన్ లైవ్ కన్సర్ట్ జరుగుతోంది కాబట్టి వేలాది అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ లోగా వీడియో పనులు పూర్తి చేసుకోవచ్చు. హడావిడి పడి లేనిపోని ఒత్తిడి తీసుకుని సగం ఉడికిన కంటెంట్ ఇచ్చే ఉద్దేశంలో బుచ్చిబాబు లేడు. అందుకే ఖరాఖండీగా వచ్చే నెల పోస్ట్ పోన్ చేసుకున్నాడట. మ్యూజిక్ పరంగా పెద్ది నుంచి వస్తున్న మొదటి పాట కావడంతో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో బుచ్చిబాబుకి తెలియంది కాదు. అందుకే రాజీ లేకుండా లేట్ అయినా పర్వాలేదంటూ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నాడు.
మార్చి 27 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆ మేరకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. బిజినెస్ పరంగా ఇంకా ఏ ఏరియాలు ఫైనల్ చేయలేదు. ట్రైలర్ వచ్చాక క్లోజ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. డిమాండ్ అయితే ఆర్ఆర్ఆర్ దగ్గరగా ఉందని, సోలో హీరోగా చరణ్ కు ఎప్పుడూ రానంత నెంబర్లు దీనికి నమోదవ్వొచ్చని అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా జగపతిబాబు, దివ్యెందు శర్మ విలన్లుగా నటిస్తున్నారు. బడ్జెట్ ఎంతో బయటకి చెప్పడం లేదు కానీ రెండు వందల కోట్ల పైమాటేనని టాక్.
రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది.. రెండేళ్ల కాలంలో వారి పనితీరు ఏ విధంగా సాగింది.…
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…