థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ ఎనిమిది వారాలు ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. బాలీవుడ్ మల్టీప్లెక్సులు ఈ కండీషన్ పాటిస్తేనే సినిమాలు వేసుకుంటామని నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పడమే కాదు అగ్రిమెంట్లు కూడా చేయించుకోవడంతో కనీసం యాభై రోజుల నిడివి లేనిదే హిందీ మూవీస్ డిజిటల్ లో రావడం లేదు. మలయాళంలో దాదాపు చాలా మంది ఫిలిం మేకర్స్ దీనికి కట్టుబడి ఉన్నారు. లోక చాప్టర్ 1 అందుకే చాలా ఆలస్యంగా బుల్లితెరపై వస్తోంది. కానీ ఇది తెలుగు, తమిళ ప్రొడ్యూసర్లలో చాలా మంది పాటించలేకపోతున్నారు. హక్కుల సొమ్ము కోసం టెంప్ట్ అయిపోయి 28 రోజులకు సై అంటున్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. ఎందుకంటే ఇంత నిడివి ఉందంటే ఎక్కువ థియేటర్ రెవిన్యూకు దోహదం చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం నలభై రోజులు మంచి ఆక్యుపెన్సీలు వస్తాయి. పుష్ప 2 ది రూల్, కల్కి 2898 ఏడి లాంటివి ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యి మంచి ఫలితాలు అందుకున్నాయి. హనుమాన్ సైతం స్పెషల్ రిక్వెస్ట్ మీద యాభై అయిదు రోజుల తర్వాత కానీ స్మార్ట్ స్క్రీన్ మీదకు రాలేదు.
అలాని అందరూ ఇలాగే ఉన్నారని కాదు. సలార్, గుంటూరు కారం నుంచి ఇప్పటి ఓజి దాకా చాలా పెద్ద సినిమాలు కేవలం ఫోర్ వీక్ విండోకి జై కొట్టినవే. ఇది మారాలని బయ్యర్లు కోరుకుంటున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలకు ఈ కండీషన్ అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే రికవరీ త్వరగా అయిపోతుంది. లిటిల్ హార్ట్స్ ముప్పై కోట్లు లాగేసి సరిగ్గా నెలకు ఈటీవీ విన్ లో వచ్చేసింది. కానీ పెద్ద సినిమాల లైఫ్ అలా కాదు. ఎక్కువ కాలం థియేటర్ రన్ జరగాలి. అప్పుడే ఎగ్జిబిషన్ రంగం లాభాల్లో ఉంటుంది. మరి డ్రాగన్ తరహాలో మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో కనీసం యాభై రోజుల గ్యాప్ పెట్టుకోవడం అత్యవసరం.
This post was last modified on October 15, 2025 12:19 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…