Movie News

అనుష్క ఆడియో సరిపోవడం లేదా

ఘాటీ విడుదల రోజుల నుంచి గంటలకు మారిపోయింది. పలు వాయిదాల తర్వాత రిలీజ్ కు రెడీ అయిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో అనుష్క టైటిల్ రోల్ చేయడం వల్ల జనంలో ఆసక్తి అయితే కనిపిస్తోంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆ స్థాయిలో లేకపోవడం కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. దర్శకుడు క్రిష్ తెరపై స్వీటీ విశ్వరూపం చూస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువి క్రియేషన్స్ కావడంతో బడ్జెట్ పరంగా రాజీ లేదని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. మరి సోషల్ మీడియాలో అంత సౌండ్ లేకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.

అనుష్క బయటికి రాకుండా కేవలం ఆడియో రూపంలో ఇస్తున్న ఇంటర్వ్యూలు, ఛాట్లు సాధారణ ప్రేక్షకుల్లో అంత ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదనేది వాస్తవం. నేరుగా మీడియా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ త్వరగా సొంతం చేసుకుంటారు. లైవ్ కాకపోయినా కనీసం రికార్డెడ్ రూపంలో ఇచ్చినా చాలు సంతోషంగా మురిసిపోతారు. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ కే ప్రమోషన్ తిప్పలు తప్పలేదు. అలాంటిది అనుష్క కనిపించకపోయినా పర్లేదు, వినిపిస్తే అదే మహా ప్రసాదమని మురిసిపోయే పరిస్థితులు వాస్తవంగా లేవు.

ఒకవేళ ఉదయం మొదటి షో కాగానే పాజిటివ్ టాక్ వచ్చిందా ఈ డిస్కషన్ మొత్తం దూదిపింజెలా ఎగిరిపోతుంది. కొంచెం అటుఇటు అయినా అనుష్క మీదే మొదటి నింద వస్తుంది. ప్రధాన నగరాలు మినహాయిస్తే ఘాటీకి జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అంటే అనుష్క ఆడియో పూర్తి స్థాయిలో పని చేయలేదు. జనం వీడియోను డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇకపై వరసగా సినిమాలు చేస్తానని చెబుతున్న అనుష్క ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించేస్తే పనైపోతుంది కదా. ఒకవేళ రిలీజ్ తర్వాత ఏదైనా సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేస్తారేమో. జరగదని తెలిసినా ఆశపడటం తప్పేం కాదుగా.

This post was last modified on September 4, 2025 7:27 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago