ఘాటీ విడుదల రోజుల నుంచి గంటలకు మారిపోయింది. పలు వాయిదాల తర్వాత రిలీజ్ కు రెడీ అయిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో అనుష్క టైటిల్ రోల్ చేయడం వల్ల జనంలో ఆసక్తి అయితే కనిపిస్తోంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆ స్థాయిలో లేకపోవడం కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. దర్శకుడు క్రిష్ తెరపై స్వీటీ విశ్వరూపం చూస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువి క్రియేషన్స్ కావడంతో బడ్జెట్ పరంగా రాజీ లేదని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. మరి సోషల్ మీడియాలో అంత సౌండ్ లేకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.
అనుష్క బయటికి రాకుండా కేవలం ఆడియో రూపంలో ఇస్తున్న ఇంటర్వ్యూలు, ఛాట్లు సాధారణ ప్రేక్షకుల్లో అంత ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదనేది వాస్తవం. నేరుగా మీడియా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ త్వరగా సొంతం చేసుకుంటారు. లైవ్ కాకపోయినా కనీసం రికార్డెడ్ రూపంలో ఇచ్చినా చాలు సంతోషంగా మురిసిపోతారు. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ కే ప్రమోషన్ తిప్పలు తప్పలేదు. అలాంటిది అనుష్క కనిపించకపోయినా పర్లేదు, వినిపిస్తే అదే మహా ప్రసాదమని మురిసిపోయే పరిస్థితులు వాస్తవంగా లేవు.
ఒకవేళ ఉదయం మొదటి షో కాగానే పాజిటివ్ టాక్ వచ్చిందా ఈ డిస్కషన్ మొత్తం దూదిపింజెలా ఎగిరిపోతుంది. కొంచెం అటుఇటు అయినా అనుష్క మీదే మొదటి నింద వస్తుంది. ప్రధాన నగరాలు మినహాయిస్తే ఘాటీకి జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అంటే అనుష్క ఆడియో పూర్తి స్థాయిలో పని చేయలేదు. జనం వీడియోను డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇకపై వరసగా సినిమాలు చేస్తానని చెబుతున్న అనుష్క ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించేస్తే పనైపోతుంది కదా. ఒకవేళ రిలీజ్ తర్వాత ఏదైనా సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేస్తారేమో. జరగదని తెలిసినా ఆశపడటం తప్పేం కాదుగా.
This post was last modified on September 4, 2025 7:27 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…