ఘాటీ విడుదల రోజుల నుంచి గంటలకు మారిపోయింది. పలు వాయిదాల తర్వాత రిలీజ్ కు రెడీ అయిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో అనుష్క టైటిల్ రోల్ చేయడం వల్ల జనంలో ఆసక్తి అయితే కనిపిస్తోంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆ స్థాయిలో లేకపోవడం కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. దర్శకుడు క్రిష్ తెరపై స్వీటీ విశ్వరూపం చూస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువి క్రియేషన్స్ కావడంతో బడ్జెట్ పరంగా రాజీ లేదని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. మరి సోషల్ మీడియాలో అంత సౌండ్ లేకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.
అనుష్క బయటికి రాకుండా కేవలం ఆడియో రూపంలో ఇస్తున్న ఇంటర్వ్యూలు, ఛాట్లు సాధారణ ప్రేక్షకుల్లో అంత ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదనేది వాస్తవం. నేరుగా మీడియా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ త్వరగా సొంతం చేసుకుంటారు. లైవ్ కాకపోయినా కనీసం రికార్డెడ్ రూపంలో ఇచ్చినా చాలు సంతోషంగా మురిసిపోతారు. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ కే ప్రమోషన్ తిప్పలు తప్పలేదు. అలాంటిది అనుష్క కనిపించకపోయినా పర్లేదు, వినిపిస్తే అదే మహా ప్రసాదమని మురిసిపోయే పరిస్థితులు వాస్తవంగా లేవు.
ఒకవేళ ఉదయం మొదటి షో కాగానే పాజిటివ్ టాక్ వచ్చిందా ఈ డిస్కషన్ మొత్తం దూదిపింజెలా ఎగిరిపోతుంది. కొంచెం అటుఇటు అయినా అనుష్క మీదే మొదటి నింద వస్తుంది. ప్రధాన నగరాలు మినహాయిస్తే ఘాటీకి జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అంటే అనుష్క ఆడియో పూర్తి స్థాయిలో పని చేయలేదు. జనం వీడియోను డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇకపై వరసగా సినిమాలు చేస్తానని చెబుతున్న అనుష్క ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించేస్తే పనైపోతుంది కదా. ఒకవేళ రిలీజ్ తర్వాత ఏదైనా సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేస్తారేమో. జరగదని తెలిసినా ఆశపడటం తప్పేం కాదుగా.
This post was last modified on September 4, 2025 7:27 am
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…