వైసీపీలో కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలను బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలను దూరం చేసుకుని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. తాము ఓడిపోయామని ఆయన గతంలో ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల సెంట్రిక్గా వైసీపీ రాజకీయాలు సాగుతాయని అందరూ అనుకున్నారు.
ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చి కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా చేశారన్నది గతంలో వచ్చిన ప్రధాన విమర్శ. ఇక.. ఇప్పుడైనా పార్టీలో పరిస్థితి మారిందా అంటే తాజాగా వెలుగు చూసిన అంశం.. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి కార్యకర్తలు జగన్ ను కలుసుకునేందుకు ప్రత్యేకంగా పాసులు, అనుమతులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా.. మంత్రి నారా లోకేష్ విమర్శ చేశారంటే నిజం లేకుండా చేయరు కాబట్టి ఇది వాస్తవమేనన్న చర్చ నడుస్తుంది.
కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న జగన్ ఇట్లా పాసులు, అనుమతులు తీసుకొని తనను కలవాలని నిబంధన పెట్టి ఉంటే కనుక అది మరింతగా పార్టీని ఇబ్బంది పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలకు స్వేచ్ఛ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేరు. పార్టీని డెవలప్ చేయలేరు. పైగా కూటమి పార్టీలు బలంగా ఉన్న నేపద్యంలో వాటిని తట్టుకొని ప్రజల్లోకి వైసీపీని తీసుకు వెళ్లే బాధ్యతను భుజాలపై వేసుకునే పరిస్థితి కార్యకర్తలకు ఉండాలంటే జగన్ వైపు నుంచి వారికి సహకారం ప్రోత్సాహం మరింత ఎక్కువగా ఉండాలి.
అవి లేకుండా పాసులు -అనుమతులు అంటూ వారిని కట్టడి చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా అది మరో పెద్ద ఇబ్బందికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జగన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ తరహా పరిస్థితి కనుక కొనసాగితే పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నది ఆయన గుర్తించాలి. మరి ఈ సలహా ఎవరిచ్చారో ఏంటో తెలియకపోయినా.. నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి ఇది నిజమేనన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనిని ఎవాయిడ్ చేయాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది. కార్యకర్తలు కలుసుకునేందుకు, కార్యకర్తలను పార్టీ కార్యాలయంలోకి అనుమతించేందుకు మరింత ఎక్కువగా జగన్ చొరవ తీసుకోవాలి, లేకపోతే వారి ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి కనిపించకపోవచ్చు.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…