Political News

వైసీపీకి కార్య‌క‌ర్త‌లు.. దూర‌మా.. భార‌మా..?

వైసీపీలో కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలను బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలను దూరం చేసుకుని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. తాము ఓడిపోయామని ఆయన గతంలో ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల‌ సెంట్రిక్‌గా వైసీపీ రాజకీయాలు సాగుతాయని అందరూ అనుకున్నారు.

ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చి కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా చేశారన్నది గతంలో వచ్చిన ప్రధాన విమర్శ. ఇక.. ఇప్పుడైనా పార్టీలో పరిస్థితి మారిందా అంటే తాజాగా వెలుగు చూసిన అంశం.. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి కార్యకర్తలు జగన్ ను కలుసుకునేందుకు ప్రత్యేకంగా పాసులు, అనుమతులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా.. మంత్రి నారా లోకేష్ విమ‌ర్శ‌ చేశారంటే నిజం లేకుండా చేయరు కాబట్టి ఇది వాస్తవమేనన్న చర్చ నడుస్తుంది.

కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న జగన్ ఇట్లా పాసులు, అనుమతులు తీసుకొని తనను కలవాలని నిబంధన పెట్టి ఉంటే కనుక అది మరింతగా పార్టీని ఇబ్బంది పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలకు స్వేచ్ఛ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేరు. పార్టీని డెవలప్ చేయలేరు. పైగా కూటమి పార్టీలు బలంగా ఉన్న నేపద్యంలో వాటిని తట్టుకొని ప్రజల్లోకి వైసీపీని తీసుకు వెళ్లే బాధ్యతను భుజాలపై వేసుకునే పరిస్థితి కార్యకర్తలకు ఉండాలంటే జగన్ వైపు నుంచి వారికి సహకారం ప్రోత్సాహం మరింత ఎక్కువగా ఉండాలి.

అవి లేకుండా పాసులు -అనుమతులు అంటూ వారిని కట్టడి చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా అది మరో పెద్ద ఇబ్బందికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జగన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ తరహా పరిస్థితి కనుక కొనసాగితే పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నది ఆయన గుర్తించాలి. మరి ఈ సలహా ఎవరిచ్చారో ఏంటో తెలియకపోయినా.. నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి ఇది నిజమేన‌న్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనిని ఎవాయిడ్ చేయాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది. కార్యకర్త‌లు కలుసుకునేందుకు, కార్యకర్తలను పార్టీ కార్యాలయంలోకి అనుమతించేందుకు మరింత ఎక్కువగా జగన్ చొరవ తీసుకోవాలి, లేకపోతే వారి ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి కనిపించకపోవచ్చు.

This post was last modified on September 4, 2025 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

48 minutes ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

1 hour ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

2 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

2 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

6 hours ago