Political News

వైసీపీకి కార్య‌క‌ర్త‌లు.. దూర‌మా.. భార‌మా..?

వైసీపీలో కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలను బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలను దూరం చేసుకుని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. తాము ఓడిపోయామని ఆయన గతంలో ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల‌ సెంట్రిక్‌గా వైసీపీ రాజకీయాలు సాగుతాయని అందరూ అనుకున్నారు.

ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చి కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా చేశారన్నది గతంలో వచ్చిన ప్రధాన విమర్శ. ఇక.. ఇప్పుడైనా పార్టీలో పరిస్థితి మారిందా అంటే తాజాగా వెలుగు చూసిన అంశం.. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి కార్యకర్తలు జగన్ ను కలుసుకునేందుకు ప్రత్యేకంగా పాసులు, అనుమతులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా.. మంత్రి నారా లోకేష్ విమ‌ర్శ‌ చేశారంటే నిజం లేకుండా చేయరు కాబట్టి ఇది వాస్తవమేనన్న చర్చ నడుస్తుంది.

కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న జగన్ ఇట్లా పాసులు, అనుమతులు తీసుకొని తనను కలవాలని నిబంధన పెట్టి ఉంటే కనుక అది మరింతగా పార్టీని ఇబ్బంది పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలకు స్వేచ్ఛ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేరు. పార్టీని డెవలప్ చేయలేరు. పైగా కూటమి పార్టీలు బలంగా ఉన్న నేపద్యంలో వాటిని తట్టుకొని ప్రజల్లోకి వైసీపీని తీసుకు వెళ్లే బాధ్యతను భుజాలపై వేసుకునే పరిస్థితి కార్యకర్తలకు ఉండాలంటే జగన్ వైపు నుంచి వారికి సహకారం ప్రోత్సాహం మరింత ఎక్కువగా ఉండాలి.

అవి లేకుండా పాసులు -అనుమతులు అంటూ వారిని కట్టడి చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా అది మరో పెద్ద ఇబ్బందికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జగన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ తరహా పరిస్థితి కనుక కొనసాగితే పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నది ఆయన గుర్తించాలి. మరి ఈ సలహా ఎవరిచ్చారో ఏంటో తెలియకపోయినా.. నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి ఇది నిజమేన‌న్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనిని ఎవాయిడ్ చేయాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది. కార్యకర్త‌లు కలుసుకునేందుకు, కార్యకర్తలను పార్టీ కార్యాలయంలోకి అనుమతించేందుకు మరింత ఎక్కువగా జగన్ చొరవ తీసుకోవాలి, లేకపోతే వారి ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి కనిపించకపోవచ్చు.

This post was last modified on September 4, 2025 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

4 minutes ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

57 minutes ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

1 hour ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

2 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

2 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

2 hours ago