పవర్ స్టార్ అనగానే మనకు పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు. కెరీర్ ఆరంభంలోనే ఆయన పేరు వెనుక ఆ బిరుదు చేరిపోయింది. ఆయన సౌత్ ఇండియా అంతటా పాపులరే. కానీ వేరే భాషల్లో కూడా పవర్ స్టార్లు ఉన్న సంగతి మన జనాలకు పెద్దగా తెలియదు. తమిళంలో శ్రీనివాసన్ అనే కమెడియన్ తన పేరు వెనుక ‘పవర్ స్టార్’ పెట్టుకున్నాడు. ఆయనవన్నీ కామెడీ వేషాలే కాబట్టి లైట్ తీసుకోవచ్చు. ఐతే కన్నడలో ఒక పెద్ద స్టార్ హీరోకు పవర్ స్టార్ బిరుదుంది. అతనే.. పునీత్ రాజ్ కుమార్. ఈ హీరో ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
అతడి కొత్త సినిమా ‘యువరత్న’ అదే పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజే వెల్లడించారు. కన్నడ హీరోలకు తెలుగు మార్కెట్ మీద ఎప్పుడూ అంతగా దృష్టి ఉండేది కాదు. ఐతే ‘కేజీఎఫ్’తో వాళ్లకు ఆశలు పుట్టాయి. ఆ చిత్రాన్ని నిర్మించిన హోంబళె ఫిలిమ్సే ‘యువరత్న’ను ప్రొడ్యూస్ చేసింది. సంతోష్ ఆనండ్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ చిన్న కొడుకైన పునీత్.. తండ్రి నటించిన చాలా సినిమాల్లో బాల నటుడిగా మెరిశాడు. ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు కూడా సాధించాడు. మన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే పునీత్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ‘అప్పు’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్టయి పునీత్కు స్టార్ ఇమేజ్ తెచ్చింది. ఈ సినిమానే తర్వాత ‘ఇడియట్’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. 18 ఏళ్ల కెరీర్లో పునీత్ చాలానే బ్లాక్బస్టర్లు ఇచ్చాడు. ఒక్కడు, రెడీ లాంటి బ్లాక్ బస్టర్లను కన్నడలో పునీత్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడా భారీ విజయం సాధించాయి.
తెలుగులో డిజాస్టర్ అయిన ‘ఆంధ్రావాలా’ను కన్నడలో పూరి శిష్యుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో పునీత్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడది హిట్ కావడం విశేషం. ‘యువరత్న’లో ‘అఖిల్’ హీరోయిన్ సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో పునీత్ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.
This post was last modified on November 23, 2020 1:27 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…