దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి ఇప్పటిదాకా. ఆ మధ్య రానా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని.. అతడి కిడ్నీలు రెండూ పని చేయడం మానేశాయని.. అమెరికాలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని.. లైఫ్ రిస్క్ అయ్యే పొజిషన్లో ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొన్ని నెలల పాటు సందిగ్ధత కొనసాగింది.
చాలా బలంగా ఉన్న రానా.. ఆ సమయంలోనే బక్క చిక్కి కనిపించడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. కానీ కొన్ని నెలల తర్వాత రానా పూర్వపు స్థితికి దగ్గరగా వచ్చాడు. హుషారుగా కనిపించాడు. కొన్ని రోజులకు తన పెళ్లి కబురు కూడా చెప్పాడు. వివాహం కూడా పూర్తయి మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోవడంతో రానా ఇప్పుడు నార్మల్ అనే అనుకుంటున్నారంతా.
ఐతే చిన్నప్పట్నుంచి తాను ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నది రానా.. సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్కు రానాతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో సగం వరకు చాలా సరదాగా సాగింది. కానీ రెండో సగం చాలా ఉద్వేగభరితంగా నడిచింది. జీవితంలో బాధ కలిగించే వార్తలు వినాల్సి వచ్చినపుడు పరిస్థితి ఏంటి అని సమంత అడిగితే.. తనకు పుట్టినప్పటి నుంచే బీపీ ఉందని, అలాగే తనకు ఒక దశలో రెండు కిడ్నీలూ పాడైన పరిస్థితి వచ్చిందని రానా వెల్లడించాడు.
గుండెపోటు రావడానికి 70 శాతం, ప్రాణం పోవడానికి 30 శాతం ఆస్కారమున్న స్థితిని తాను ఎదుర్కొన్నానని రానా తెలిపాడు. జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్లో వెళ్లిపోతున్నపుడు ఒక పాజ్ లాంటిది అందరికీ వస్తుందని.. అందుకు తన జీవితమే నిదర్శనం అని రానా చెప్పుకొచ్చాడు. ఐతే క్లిష్ట పరిస్థితుల్లో రానా దృఢంగా నిలబడ్డ తీరు అద్భుతమని, అందుకే అతను తన సూపర్ హీరో అని ఎమోషనల్గా వ్యాఖ్యానించింది సామ్. ఆరోగ్య పరంగా తాను ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది రానా ఈ ప్రోమోలో వెల్లడించలేదు. బహుశా పూర్తి ఎపిసోడ్లో ఆ వివరాలు ఉండొచ్చేమో.
This post was last modified on November 23, 2020 1:21 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…