దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి ఇప్పటిదాకా. ఆ మధ్య రానా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని.. అతడి కిడ్నీలు రెండూ పని చేయడం మానేశాయని.. అమెరికాలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని.. లైఫ్ రిస్క్ అయ్యే పొజిషన్లో ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొన్ని నెలల పాటు సందిగ్ధత కొనసాగింది.
చాలా బలంగా ఉన్న రానా.. ఆ సమయంలోనే బక్క చిక్కి కనిపించడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. కానీ కొన్ని నెలల తర్వాత రానా పూర్వపు స్థితికి దగ్గరగా వచ్చాడు. హుషారుగా కనిపించాడు. కొన్ని రోజులకు తన పెళ్లి కబురు కూడా చెప్పాడు. వివాహం కూడా పూర్తయి మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోవడంతో రానా ఇప్పుడు నార్మల్ అనే అనుకుంటున్నారంతా.
ఐతే చిన్నప్పట్నుంచి తాను ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నది రానా.. సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్కు రానాతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో సగం వరకు చాలా సరదాగా సాగింది. కానీ రెండో సగం చాలా ఉద్వేగభరితంగా నడిచింది. జీవితంలో బాధ కలిగించే వార్తలు వినాల్సి వచ్చినపుడు పరిస్థితి ఏంటి అని సమంత అడిగితే.. తనకు పుట్టినప్పటి నుంచే బీపీ ఉందని, అలాగే తనకు ఒక దశలో రెండు కిడ్నీలూ పాడైన పరిస్థితి వచ్చిందని రానా వెల్లడించాడు.
గుండెపోటు రావడానికి 70 శాతం, ప్రాణం పోవడానికి 30 శాతం ఆస్కారమున్న స్థితిని తాను ఎదుర్కొన్నానని రానా తెలిపాడు. జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్లో వెళ్లిపోతున్నపుడు ఒక పాజ్ లాంటిది అందరికీ వస్తుందని.. అందుకు తన జీవితమే నిదర్శనం అని రానా చెప్పుకొచ్చాడు. ఐతే క్లిష్ట పరిస్థితుల్లో రానా దృఢంగా నిలబడ్డ తీరు అద్భుతమని, అందుకే అతను తన సూపర్ హీరో అని ఎమోషనల్గా వ్యాఖ్యానించింది సామ్. ఆరోగ్య పరంగా తాను ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది రానా ఈ ప్రోమోలో వెల్లడించలేదు. బహుశా పూర్తి ఎపిసోడ్లో ఆ వివరాలు ఉండొచ్చేమో.
This post was last modified on November 23, 2020 1:21 pm
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…