దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి ఇప్పటిదాకా. ఆ మధ్య రానా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని.. అతడి కిడ్నీలు రెండూ పని చేయడం మానేశాయని.. అమెరికాలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని.. లైఫ్ రిస్క్ అయ్యే పొజిషన్లో ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొన్ని నెలల పాటు సందిగ్ధత కొనసాగింది.
చాలా బలంగా ఉన్న రానా.. ఆ సమయంలోనే బక్క చిక్కి కనిపించడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. కానీ కొన్ని నెలల తర్వాత రానా పూర్వపు స్థితికి దగ్గరగా వచ్చాడు. హుషారుగా కనిపించాడు. కొన్ని రోజులకు తన పెళ్లి కబురు కూడా చెప్పాడు. వివాహం కూడా పూర్తయి మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోవడంతో రానా ఇప్పుడు నార్మల్ అనే అనుకుంటున్నారంతా.
ఐతే చిన్నప్పట్నుంచి తాను ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నది రానా.. సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్కు రానాతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో సగం వరకు చాలా సరదాగా సాగింది. కానీ రెండో సగం చాలా ఉద్వేగభరితంగా నడిచింది. జీవితంలో బాధ కలిగించే వార్తలు వినాల్సి వచ్చినపుడు పరిస్థితి ఏంటి అని సమంత అడిగితే.. తనకు పుట్టినప్పటి నుంచే బీపీ ఉందని, అలాగే తనకు ఒక దశలో రెండు కిడ్నీలూ పాడైన పరిస్థితి వచ్చిందని రానా వెల్లడించాడు.
గుండెపోటు రావడానికి 70 శాతం, ప్రాణం పోవడానికి 30 శాతం ఆస్కారమున్న స్థితిని తాను ఎదుర్కొన్నానని రానా తెలిపాడు. జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్లో వెళ్లిపోతున్నపుడు ఒక పాజ్ లాంటిది అందరికీ వస్తుందని.. అందుకు తన జీవితమే నిదర్శనం అని రానా చెప్పుకొచ్చాడు. ఐతే క్లిష్ట పరిస్థితుల్లో రానా దృఢంగా నిలబడ్డ తీరు అద్భుతమని, అందుకే అతను తన సూపర్ హీరో అని ఎమోషనల్గా వ్యాఖ్యానించింది సామ్. ఆరోగ్య పరంగా తాను ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది రానా ఈ ప్రోమోలో వెల్లడించలేదు. బహుశా పూర్తి ఎపిసోడ్లో ఆ వివరాలు ఉండొచ్చేమో.
This post was last modified on November 23, 2020 1:21 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…