మంత్రి హరీష్ రావు పై దుబ్బాక ఉపఎన్నిక ప్రభావం బాగా పడినట్లుంది. మొన్ననే జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయిన విషయం తెలిసిందే. నిజానికి అధికారపార్టీ అభ్యర్ధి ఓటమి చాలా అనూహ్యమనే చెప్పాలి. సరే ఊహించిందే అయినా అనూహ్యమైన ఓటమి ఓటమే అనటంలో సందేహం లేదు. ఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యత హరీష్ మీద పెట్టారు కేసీయార్. మొదట్లో ఉపఎన్నికను చాలా తేలిగ్గా తీసుకున్న కేసీయార్ కొద్ది రోజుల తర్వాత పూర్తిగా దృష్టిపెట్టారు.
ఇందులో భాగంగానే మంత్రి హరీష్ ను ఇన్చార్జిగా నియమించారు. దాంతో మంత్రి కూడా నూరుశాతం ఎఫర్టు పెట్టారు. రాత్రనక, పగలనక నియోజకవర్గంలోనే క్యాంపు వేసి ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు 1179 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయారు. తమ అభ్యర్ధి ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు హరీష్ కూడా ప్రకటించేశారు. సరే అదంతా చరిత్రగా మిగిలిపోయిందిపుడు.
మరి తాజాగా మొదలైన గ్రేటర్ హదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల సమరంలో ఎక్కడ చూసినా కేసీయర్ కొడుకు, మంత్రి కేటీయారే కనబడుతున్నారు. డివిజన్లలో ప్రచారం చేసినా, పార్టీ తరపున తయారు చేసిన వాల్ పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లలో లో కూడా ఎక్కడ చూసినా కేసీయార్, కేటీయార్ మాత్రమే కనబడుతున్నారు. డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు వేయించుకున్న పోస్టర్లలో కూడా ఎక్కువగా సీఎం, కేటీయార్ మొహాలు మాత్రమే కనబడుతున్నాయి. పోయిన ఎన్నికల్లో హరీష్ విపరీతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
అంటే హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అర్ధమవుతోంది. నిజానికి హరీష్ ను పక్కన పెట్టేయాల్సిన అవసరమే లేదు. దుబ్బాకలో పార్టీ ఓడిపోయిందంటే అందుకు ప్రధాన కారణం కేసీయారే కానీ హరీష్ ఎంతమాత్రం కాదు. అలాంటిది ఇపుడు హరీష్ ను ఎందుకు దూరం పెట్టేవశారు. ఎందుకంటే కొడుకు కేటీయార్ కు మేనల్లుడు హరీష్ పోటీ వస్తారో అన్న భయంతోనే అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వం విషయంలో కేటీయార్ కన్నా హరీషే గట్టి వాడనే ప్రచారం పార్టీలో ఎప్పటి నుండో జరుగుతోంది. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో హరీష్ ను దూరంగా పెట్టేసి కొడుకు కేటీయార్ ను మాత్రమే బాగా ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. దుబ్బాకలో ఓడినందుకే హరీష్ ను పక్కన పెట్టేశారంటు చెప్పుకుంటున్నారు.
This post was last modified on November 23, 2020 1:33 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…