తమిళంలో అగ్ర కథానాయకులైన విజయ్, అజిత్ ఇద్దరూ కూడా చాలా సింపుల్గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. వివాదాలకు దూరంగా ఉంటారు. అభిమానులను ఎప్పుడూ రెచ్చగొట్టరు. వాళ్లను ఎక్కువగా ఎంగేజ్ చేయరు. ముఖ్యంగా అజిత్ అయితే తన సినిమాల ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లు కూడా చేయనివ్వడు. అభిమానులను నేరుగా కలవడు. వాళ్లతో ఏ రకమైన కమ్యూనికేషన్ పెట్టుకోడు. డబ్బులు పెట్టించి పీఆర్వోలతో అభిమాన సంఘాలను మెయింటైన్ కూడా చేయించడు. విజయ్ సైతం సాధ్యమైనంత సింపుల్గానే సాగిపోతాడు. అభిమానుల్ని ఎప్పుడూ రెచ్చగొట్టడు.
కానీ వీళ్లిద్దరి అభిమానులు తమ హీరోలకు పూర్తి విరుద్ధం. వాళ్లు నిరంతరం తమ హీరోకు ఎలివేషన్లు ఇస్తూ.. అవతలి హీరోను కించపరిచే ప్రయత్నంలోనే ఉంటారు. దక్షిణాదిన సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్కు శ్రీకారం చుట్టింది.. వాటిని దిగజార్చింది ప్రధానంగా వీళ్లే.
నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వేరే హీరోను కించపరిచే ట్రెండ్ మొదలుపెట్టిందే విజయ్, అజిత్ అభిమానులు. తరచుగా వీళ్లు ఈ గేమ్ ఆడుతుంటారు. ఒకరి అభిమానులు అవతలి హీరో మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు మొదలుపెట్టడం.. తర్వాత అవతలి హీరో అభిమానులు దానికి పోటీగా ఇంకో హ్యాష్ ట్యాగ్ తేవడం.. కొన్నేళ్లుగా నడుస్తోంది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ.. ఇప్పుడు మళ్లీ వాళ్ల వార్ మొదలైంది. నిన్న విజయ్ అభిమానులేమో #crossbreedajith అని.. అజిత్ ఫ్యాన్సేమో #cressgendervijayfans అని హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేశారు.
ఎవరు ముందు మొదలుపెట్టారన్నది పక్కన పెడితే.. ఇరు వర్గాలూ దిగజారి పోయి ట్వీట్లు వేశారు. అందులో ఎడిట్లు, మీమ్స్, ట్రోల్స్ చూస్తే అభిమానులు ఇంత చీప్గా ఉంటారా అనిపిస్తుంది. ఇండియా లెవెల్లో ఇవి ట్రెండ్ అయ్యాయి. మేం ఎక్కువ ట్వీట్లు వేశాం అంటే మేం ఎక్కువ వేశాం అని దాన్నో ఘనకార్యం లాగా చెప్పుకున్నారు ఇరువురి అభిమానులు. ఇంతకంటే దిగజారుడు ఏముంటుంది?
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…