కొత్త ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ లో కనివిని ఎరుగని అద్భుతాలు జరగలేదు. ప్యాన్ ఇండియా వండర్లు రాలేదు. మధ్యలో అయిదారు వారాలు థియేటర్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. పడటం లేవడం బాక్సాఫీస్ కు సర్వ సాధారణంగా మారిపోయిన తరుణంలో సక్సెస్ రేట్ అంతకంతా పడిపోవడం ఒక వార్నింగ్ బెల్ గా తీసుకోవాలి. గడిచిన ఈ అర్ధ సంవత్సర కాలంలో గట్టిగా చెప్పుకునే హిట్లు కేవలం తొమ్మిదేనంటే ఆశ్చర్యం కలిగినా అక్షరాలా నిజం. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో యునానిమస్ విన్నర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచింది. ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లతో సింహాసనం మీద కూర్చుంది.
అదే జనవరిలో వచ్చిన ‘డాకు మహారాజ్’ ఓ మోస్తరు హిట్ గా నిలిచింది కానీ మరీ ఫ్యాన్స్ ఊహించుకున్న అఖండ రేంజ్ లో మేజిక్ అయితే చేయలేదు. దర్శకుడు బాబీ వర్కౌట్ అయ్యే ప్రోడక్ట్ ఇవ్వడం ఊరట. ‘తండేల్’ వంద కోట్ల క్లబ్బులో చేరడం ద్వారా చైతు ఫ్లాపుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. నాని నిర్మించిన ‘కోర్ట్’ ఊహించిన దానికన్నా పెద్ద విజయం అందుకోవడం ట్రేడ్ కి లాభాలు వచ్చేలా చేసింది. నాని హీరోగా వచ్చిన ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ మరీ తీవ్రంగా కాదు కానీ హిట్టు క్యాటగిరీలో పడిపోవడం ఊరట కలిగించింది. లిమిటెడ్ బడ్జెట్ తో వచ్చిన ‘సింగిల్’ కొన్నవాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చి క్షేమంగా గట్టెక్కింది.
సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సైతం సక్సెస్ బాట పట్టి హిట్టు లిస్టులో చేరిపోయింది. తాజాగా ‘కుబేర’తో పాటు ‘కన్నప్ప’ కూడా సక్సెస్ బాట పట్టడం శుభ పరిణామం. విచారకరంగా మంచి అంచనాలు తెచ్చుకున్న చాలా సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టడం ఆ ఆరు నెలల్లో అసలు ట్రాజెడీ. గేమ్ ఛేంజర్, లైలా, దిల్ రుబా, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, మజాకా, రాబిన్ హుడ్, జాక్, ఓదెల 2, సారంగపాణి జాతకం, భైరవం, 8 వసంతాలు మొదలైనవన్నీ డీసెంట్ హైప్ తో వచ్చి తీవ్రంగా నిరాశపరిచాయి. ఇంకా అడ్రెస్ లేకుండా పోయిన చిన్నా చితక లిస్టు పెద్దదే ఉంది. రాబోయే ఆరు నెలల కాలం టాలీవుడ్ కు చాలా కీలకం కానుంది.
This post was last modified on June 30, 2025 1:44 pm
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…