వాయిదాల మీద వాయిదాలతో ఫ్యాన్స్ సహనంతో పాటు ఇతర రిలీజులతో ఆడుకున్న హరిహర వీరమల్లు విడుదల తేదీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 18 రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ట్రైలర్ రెడీ అయ్యాక అందులోనే డేట్ పొందుపరిస్తారని టాక్. వాస్తవానికి ఈ నెలాఖరే వస్తుందనే ప్రచారం కొద్దిరోజుల క్రితం జరిగింది. కానీ మంచు విష్ణు కన్నప్ప తప్పుకునే ఉద్దేశంలో లేడు. క్లాష్ వల్ల ఇద్దరికి ఇబ్బంది కలుగుతుందనే కోణంలో చర్చలు జరిగాయట. మార్కెట్ పరంగా పవన్, విష్ణు ఒకటే కాకపోయినా కన్నప్పకు ప్రభాస్ ఆకర్షణ బలంగా నిలుస్తోంది.
ఒకవేళ జూలై 18 నిజమైన పక్షంలో నెల రోజుల సమయం మిగిలిన పనులకు సరిపోతుంది. ప్రమోషన్లకు వస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నంకు హామీ ఇచ్చారట. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే కాక ముఖ్యమైన వాళ్లకు ఇంటర్వ్యూలు, ఏదైనా స్పెషల్ ప్రోగ్రాంస్ లాంటి వాటికి చేయూతనిస్తానని హామీ ఇచ్చినట్టుగా వినికిడి. ఇది ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎందుకంటే ముందస్తుగా జరిగే వేడుకకు తప్ప పవన్ ఇంకెలాంటి పబ్లిసిటీ క్యాంపైన్స్ లో ఉండరు. కానీ హరిహర వీరమల్లుకి మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయం. ట్రైలర్ ఇంకో వారం పది రోజుల్లో రెడీ చేసి దాని లాంచ్ గ్రాండ్ గా చేయాలనే ప్లానింగ్ ఉంది.
ప్రస్తుతానికి వీరమల్లు వస్తున్న స్లాట్ ఖాళీగా ఉంది. ముందు వారం జూలై 11 అనుష్క ఘాటీ మాత్రమే ఉంది. దాని ప్రచారాలు కూడా యువి సంస్థ ఇంకా మొదలుపెట్టలేదు. ఒకే రోజు కాదు కాబట్టి ఇబ్బందేం ఉండదు. ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లుకి ఇది బెస్ట్ డేట్. ఎందుకంటే ఆగస్ట్ 1 కింగ్ డమ్ వచ్చే ఆలోచనలో ఉంది. 14న వార్ 2, కూలీ దిగుతాయి. తర్వాత రవితేజ మాస్ జాతర ఉంటుంది. వాటిని డిస్ట్రబ్ చేయడం కంటే ముందు వచ్చేయడం బెటర్. విశ్వంభర కనుచూపు మేరలో వచ్చే సూచనలు లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ చూపంతా వీరమల్లు అప్డేట్స్ మీదే ఉంది. అన్నీ పక్కా అయ్యాక ప్రమోషన్ రీస్టార్ట్ చేస్తారు.
This post was last modified on June 13, 2025 2:08 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…