Political News

మృత్యుంజయుడికి మోదీ పరామర్శ… ఎలా బతికాడంటే?

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలా మంటల్లో నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడే గుజరాత్ కే చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ మోదీ అతడిని ఆరా తీశారు. అంతేకాకుండా తామంతా అండగా ఉన్నామని, భయపడాల్సిన పని లేదని కూడా మోదీ అతడిని అభయం ఇచ్చారు. మోదీని చూడగానే… కొండంత అండ లభించినట్టుగా ఫీల్ అయిన రమేశ్… ప్రమాదం నుంచి తాను బయటపడినా తన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని బోరుమన్నాడు.

ఇక అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానన్న విషయాన్ని రమేశ్ వైద్యులకు వివరించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే ఆకాశంలోనే రెండు ముక్కలు అయిపోయిందని తెలిపాడు. ఆ సమయంలో తాను కూర్చున్న 11ఏ సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉందని వివరించాడు. విమానం రెండు ముక్కలు కాగానే… తన సీటు విమానం నుంచి ఊడి అల్లంత దూరాన పడిందని తెలిపాడు. తాను సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా తాను కూడా సీటుతో సహా అల్లంత దూరాన పడిపోయానని వివరించాడు.

ఇదిలా ఉంటే… ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలో ఉన్న వారిలో రమేశ్ మినహా 241 మంది చనిపోగా… విమానం కూలిన మెడికల్ కాలేజీ భవనంలోని వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి 24 మంది చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 265గా తేలింది. ఈ మేర పౌరుల ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదం భారత్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా పరిగణిస్తున్నారు.

This post was last modified on June 13, 2025 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

12 hours ago