Political News

మృత్యుంజయుడికి మోదీ పరామర్శ… ఎలా బతికాడంటే?

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలా మంటల్లో నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడే గుజరాత్ కే చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ మోదీ అతడిని ఆరా తీశారు. అంతేకాకుండా తామంతా అండగా ఉన్నామని, భయపడాల్సిన పని లేదని కూడా మోదీ అతడిని అభయం ఇచ్చారు. మోదీని చూడగానే… కొండంత అండ లభించినట్టుగా ఫీల్ అయిన రమేశ్… ప్రమాదం నుంచి తాను బయటపడినా తన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని బోరుమన్నాడు.

ఇక అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానన్న విషయాన్ని రమేశ్ వైద్యులకు వివరించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే ఆకాశంలోనే రెండు ముక్కలు అయిపోయిందని తెలిపాడు. ఆ సమయంలో తాను కూర్చున్న 11ఏ సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉందని వివరించాడు. విమానం రెండు ముక్కలు కాగానే… తన సీటు విమానం నుంచి ఊడి అల్లంత దూరాన పడిందని తెలిపాడు. తాను సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా తాను కూడా సీటుతో సహా అల్లంత దూరాన పడిపోయానని వివరించాడు.

ఇదిలా ఉంటే… ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలో ఉన్న వారిలో రమేశ్ మినహా 241 మంది చనిపోగా… విమానం కూలిన మెడికల్ కాలేజీ భవనంలోని వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి 24 మంది చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 265గా తేలింది. ఈ మేర పౌరుల ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదం భారత్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా పరిగణిస్తున్నారు.

This post was last modified on June 13, 2025 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

35 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

42 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago