పెహల్గామ్ ఉదంతం తర్వాత పాకిస్థాన్ మీద తీవ్ర చర్యలకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల నుంచి కూడా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా శత్రుదేశం ఆర్టిస్టులు ఎవరైనా ఇక్కడి సినిమాల్లో నటించకుండా ఒకవేళ నటిస్తే వాటిని నిషేధించేలా చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిస్తున్న జనాల సంఖ్య పెరుగుతోంది. వాటిలో ఫవద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ మొదటిది. ఇప్పటికే బ్యాన్ ట్రెండింగ్ నడుస్తోంది. ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ తండ్రి కూడా గతంలో పాకిస్థాన్ మిలిటరీలో పని చేశారనే ప్రచారం ఊపందుకోవడంతో ఫౌజీ మీద సైతం వ్యతిరేక గళం మొదలయ్యింది.
దీంతో ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి ఇస్మాయిల్ క్లారిటీ ఇచ్చింది. పెహల్గామ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు సంతాపం ప్రకటించి తన గురించి జరుగుతున్న ప్రచారం పట్ల వివరణ పొందుపరిచింది. తన కుటుంబానికి గతంలో, వర్తమానంలో పాకిస్థాన్ మిలిటరీతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, కేవలం ద్వేషంతో వీటిని ప్రచారం చేశారని పేర్కొంది. తాను ఇండో అమెరికనని స్పష్టం చేసింది. యూత్ లో ఉన్నప్పుడే తల్లితండ్రులు చట్టప్రకారం అమెరికా వచ్చి సెటిలై అక్కడి పౌరులయ్యారని, లాస్ యాంజిల్స్, క్యాలిఫోర్నియాలో జన్మించిన తాను యూనివర్సిటీ చదువు అక్కడే పూర్తి చేశానని పేర్కొంది.
హిందీ, గుజరాతి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఇమాన్వీ చదువు పూర్తయ్యాక ఢిల్లీ వచ్చి నటి, కొరియోగ్రాఫర్, డాన్సర్ గా కెరీర్ ఎంచుకున్నట్టు పేర్కొంది. తన గురించి ఇలా ప్రచారం చేయడం సబబు కాదని, పేరొందిన కొన్ని మీడియా సంస్థలు సమాచారం పూర్తిగా తెలుసుకుండా కథనాలు వేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఏదైతేనేం ఇమాన్వి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఒక పెద్ద అనుమానం తీరిపోయింది. అయితే అసలు వివాదానికి దారి తీసిన తండ్రి ఉద్యోగం, నేపథ్యం గురించి మాత్రం ఇమాన్వి అందులో పేర్కొనలేదు. మొత్తానికి ఫౌజి హీరోయిన్ గురించి జరుగుతున్న నెగటివ్ పబ్లిసిటీకి చెక్ పడటం మంచి పరిణామం.
This post was last modified on April 24, 2025 12:16 pm
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్వాత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో…
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం..…
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…
పహల్ గాం ఉగ్రదాడిని ప్రోత్సహించి భారత్ తో సున్నం పెట్టుకున్న దాయాదీ దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు షాకుల మీద…
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన జయం రవి కుటుంబ వివాదం కొంత కాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.…