బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిర్లిప్తత నెలకొంది. చాలా థియేటర్ల దగ్గర స్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. పట్టుమని పది మంది రాక షోలు క్యాన్సిల్ చేసుకుంటూ, సిబ్బంది జీతాలను భరాయించుకుంటూ ఎగ్జిబిటర్లు చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఊపిరి పోస్తాయనుకుంటే హడావిడి తప్ప కలెక్షన్ల పరంగా ఎలాంటి అద్భుతాలు చేయలేకపోవడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఓ రెండు మూడు రోజులు కళ్యాణ్ రామ్ పరవాలేదనిపించినా తర్వాత సైలెంట్ అయిపోవడం పరిస్థితిని ఇంకా కిందకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రేపు ఏకంగా డజను కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఉన్నంతలో కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది సారంగపాణి జాతకంకే. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష చెముడు లాంటి నోటెడ్ క్యాస్టింగ్ తో ట్రైలర్ లో చూపించిన ఫన్ కాసింత అంచనాలు రేకెత్తించేలా చేసింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ట్రాక్ రికార్డు కొంత డౌన్ లోనే ఉన్నా అష్టాచెమ్మ, సమ్మోహనం నాటి హాస్యాన్ని, సున్నితత్వాన్ని కనక ఇందులో చూపిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని టికెట్లు కొనేలా చేయొచ్చు. కాంపిటీషన్ లో ఉన్న చౌర్య పాఠం కొంచెం వెరైటీ పబ్లిసిటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్ పరంగా వెనుకబడి ఉన్న సంపూర్ణేష్ బాబు సోదరా ఏ మేరకు జనాన్ని రప్పిస్తుందో మార్నింగ్ షో అయ్యాక కానీ చెప్పలేం.
శివ శంభో, హలొ బేబీ, ఏఎల్సిసి, సర్వం సిద్ధం, సూర్యాపేట జంక్షన్, మన ఇద్దరి ప్రేమకథ, సిక్స్ జర్నీ ఇవేవి కనీసం పేర్లు కూడా ఆడియన్స్ కి తెలియనంత వీక్ గా ప్రమోషన్లు చేసుకున్నాయి. మలయాళం డబ్బింగులు తుడరుమ్, అలిపుజ జింఖానాలు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప మన ప్రేక్షకులను కదిలించడం కష్టం. ఒరిజినల్ వెర్షన్ టాక్స్ ఎలా ఉన్నా ఇక్కడ బజ్ లేకపోవడం గమనించాలి. సో ఎలా చూసుకున్నా సారంగపాణి జాతకం కనక కనీసం ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లు కళ్లచూడవచ్చు. వచ్చే వారం మే 1 నాని హిట్ 3 ది థర్డ్ కేస్ వచ్చేలోపు ఎంత రాబట్టుగోగలిగితే అంత సారంగపాణికి అంత మేలు.
This post was last modified on April 24, 2025 11:43 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…