Movie News

మలుపులు తిరుగుతున్న ఎంపురాన్ వివాదం

మొన్న గురువారం విడుదలైన ఎల్2 ఎంపురాన్ వివాదాలకు అంత సులభంగా శుభం కార్డు పడేలా లేదు. ఇతర భాషల్లో ఫ్లాప్ అయినా మలయాళంలో బ్లాక్ బస్టర్ దిశగా రికార్డులు నమోదు చేస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో పలు సన్నివేశాలు, పాత్రల పేర్ల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఏకంగా హీరో మోహన్ లాల్ పబ్లిక్ గా క్షమాపణ చెప్పి అవన్నీ తీసేస్తామని చెప్పే దాకా పరిస్థితి వెళ్ళిపోయింది. మధ్యలో దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ స్పందించలేని పరిస్థితిలో మౌనాన్ని ఆశ్రయించాడు. తాజాగా అతని తల్లి మల్లిక ఈ కాంట్రవర్సీ గురించి సుదీర్ఘమైన పోస్టులో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆవిడ చెప్పిన ప్రకారం ఎంపురాన్ స్క్రిప్ట్ పని చేసిన ప్రతి ఒక్కరు చదివారు. మోహన్ లాల్ సినిమా చూడలేదు, తనకు తెలియకుండా కొన్ని ఎపిసోడ్లు తీశారనేది పచ్చి అబద్దం. పృథ్విరాజ్ ని అందరూ బలిపశువుని చేయాలని చూస్తున్నారు. హీరోకు, నిర్మాతలకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతోంది. ఎల్2 వెనుక ఏం జరిగిందనేది మల్లికకు పూర్తిగా తెలుసు. ఒకవేళ స్క్రిప్ట్ లో సమస్యలు ఉంటే దానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి తప్ప పృథ్విరాజ్ ఒక్కడే కాదు. రచయిత కూడా ఎల్లప్పుడూ పక్కనే ఉండేవారు. అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు జరిగేవి. మరి పృథ్విరాజ్ ఒక్కడే ఎలా తప్పు చేసినట్టే.

మల్లిక గారి ప్రశ్నల్లో తర్కం ఉంది కానీ సినిమా ఫలితం ఏదైనా, దానికి ముసురుకున్న వివాదం ఎలాంటిదైనా ముందుగా అందరి వేళ్ళు వెళ్ళేది దర్శకుడి వైపే. అందుకే పృథ్విరాజ్ సుకుమారన్ టార్గెట్ అయ్యాడు. ఫలానా మతాన్ని కించపరిచేలా ఏదైనా ఉందనిపించినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయం విడుదలకు ముందే తీసుకోవాలి. ఇప్పుడు పదిహేను కట్లు చేసి, పాత్రల పేర్లు మార్చినంత మాత్రాన డ్యామేజ్ పూర్తిగా తగ్గదు. ఆల్రెడీ మొదటి నాలుగైదు రోజులు చూసినవాళ్ల మనసులో డిలీట్ చేయలేరుగా. ఈ వ్యవహారం ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో అంతు చిక్కడం లేదు.

This post was last modified on March 31, 2025 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago