Trends

మొన్న రణవీర్, నిన్న కునాల్.. నేడు స్వాతి

స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ… కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను స్టాండప్ కమెడియన్ల పేరిట బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు వాటిని బహిరంగ చర్చకు పెట్టేసి కంపు చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న రణవీర్ అహ్లాబాదియా వ్యవహారం దేశవ్యాప్తంగా పెను విమర్శలకు కారణమైంది. కేసులనూ, కోర్టు అక్షింతనూ ఎదుర్కొన్నాడు. అతడి ఉదంతాన్ని మరువక ముందే కునాల్ కామ్రా పాలకులనే విమర్శించి బుక్కయ్యాడు. ఇప్పుడు లేడీ స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్ దేవా వంతు వచ్చింది. 

ఢిల్లీకి చెందిన స్వాతి ప్రతిష్ఠాత్మక అమిటీ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఆమె స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఓ మోస్తరు అడల్డ్ కంటెంట్ ఆమె షోలలో ఉంటుందని చాలా రోజులుగానే విమర్శలు వినిపిస్తు  న్నాయి. తాజాగా ఆమె కామెడికి చెందిన ఓ క్లీప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అదేదో ఆమె కామెడీ బాగుందని కాదు… నాలుగ్గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాన్ని బహిరంగ వేదికలపైకి తీసుకురా వడమే కాకుండా దానిని కామెడీగా అభివర్ణించి… కన్న తల్లి ప్రస్తావనను తీసుకువచ్చి…ఓ వైబ్రేటర్ గరించి తల్లి తనతో సంభాషించారని చెప్పడం నిజంగానే జుగుత్పనే కలిగించింది.

ఈ షొలో స్వాతి తనకు, తన తల్లికి మధ్య జరిగిన సంభాషణ అంటూ అభ్యంతరకర సన్నివేశాలను చెబుతూ నవ్వడం, దానిని విన్న ప్రేక్షకులు కూడా ఇకిలించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. ఓ పెళ్లి కాని యువతి అయి ఉండి… అభ్యంతకర సన్నివేశాలను తన తల్లి తనతో చర్చించిందంటూ స్వాతి చెప్పిన తీరు అభ్యంతరకరమేనని చెప్పక తప్పదు. కామెడీ అన్నాక హద్దుల్లో ఉన్నంత వరకేనని… అదే హద్దులు దాటే కామెడీ.. జుగుత్పేనని గుర్తుంచు కోవాలని పలువురు స్వాతిపై విరుచుకుపడుతున్నారు. స్టాండప్ కామెడీ పేరిట వీరు బూతులతో చెలరేగి పోతన్నారన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి స్వాతి ఈ విమర్శల సుడి నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

This post was last modified on March 31, 2025 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

58 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago