Political News

బాబు మౌనం.. ముస్లింల నిర‌స‌న‌.. రీజ‌నేంటి?

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గ‌త వారం రోజులుగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి స్పంద‌నా క‌నిపించ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024ను వారు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. త‌ద్వారా.. ముస్లింల హ‌క్కుల‌పై దాడి చేస్తున్నార‌ని ముస్లిం పెద్ద‌లు చెబుతున్నారు. కాగా.. ఈ వ్య‌వ‌హారాన్ని కేంద్రం రాష్ట్రాల నెత్తిపై పెట్టింది.

కేంద్రం తీసుకువ‌చ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును రాష్ట్రాల్లో ఆమోదించి పంపిస్తే.. దానిని కేంద్రం ఆమోదించి మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయం మేర‌కు.. నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నుంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ.. తీర్మానాలు చేశాయి. అయితే.. ఏపీ విష‌యానికి వ‌స్తే మాత్రం దీనిపై సందిగ్ధ‌త కొనసాగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం స‌హా.. మంత్రులు ఎవ‌రూ కూడా ఈ బిల్లుపై ఎలాంటి నిర్న‌యం తీసుకుంటామ‌న్న‌ది చెప్ప‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే ముస్లిం సామాజిక వ‌ర్గం నుంచి స‌ర్కారు పై విమ‌ర్శ‌లు, నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం రంజాన్‌ను పుర‌స్క‌రించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. అయితే.. దీనిని బాయ్ కాట్ చేస్తున్న‌ట్టు ఏపీ ముస్లిం, మౌజ‌న్ల సంఘాలు ప్ర‌క‌టించాయి. టీడీపీ అనుకూల ముస్లింలు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా రంజాన్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, గుంటూరు, అనంత‌పురం జిల్లాలో ముస్లింలు రోడ్డెక్కారు. త‌మ‌కు అన్యాయం చేసే వ‌క్ఫ్ బిల్లును వ్య‌తిరేకించాల‌ని.. దీనికి ఆమోదం తెల‌పొద్ద‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నిస్తూ.. నినాదాలు చేశారు. మ‌రి ఇప్ప‌టికైనా టీడీపీ, జ‌న‌సేన‌లు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాయో లేదో చూడాలి.

This post was last modified on March 31, 2025 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

28 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

41 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago