ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గత వారం రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024ను వారు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా.. ముస్లింల హక్కులపై దాడి చేస్తున్నారని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. కాగా.. ఈ వ్యవహారాన్ని కేంద్రం రాష్ట్రాల నెత్తిపై పెట్టింది.
కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రాష్ట్రాల్లో ఆమోదించి పంపిస్తే.. దానిని కేంద్రం ఆమోదించి మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయం మేరకు.. నిర్ణయం ప్రకటించనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. తీర్మానాలు చేశాయి. అయితే.. ఏపీ విషయానికి వస్తే మాత్రం దీనిపై సందిగ్ధత కొనసాగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం సహా.. మంత్రులు ఎవరూ కూడా ఈ బిల్లుపై ఎలాంటి నిర్నయం తీసుకుంటామన్నది చెప్పడం లేదు.
ఈ నేపథ్యంలోనే ముస్లిం సామాజిక వర్గం నుంచి సర్కారు పై విమర్శలు, నిరసనలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం రంజాన్ను పురస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. అయితే.. దీనిని బాయ్ కాట్ చేస్తున్నట్టు ఏపీ ముస్లిం, మౌజన్ల సంఘాలు ప్రకటించాయి. టీడీపీ అనుకూల ముస్లింలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం.
తాజాగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు, విజయవాడ, గుంటూరు, అనంతపురం జిల్లాలో ముస్లింలు రోడ్డెక్కారు. తమకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని.. దీనికి ఆమోదం తెలపొద్దని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ.. నినాదాలు చేశారు. మరి ఇప్పటికైనా టీడీపీ, జనసేనలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాయో లేదో చూడాలి.
This post was last modified on March 31, 2025 1:19 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…