Movie News

ప్యాన్ ఇండియా నిర్మాతలూ….పారా హుషార్

అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక స్థాయికి చేరుకుంది. విడుదలకు కొన్నిగంటల ముందే మంచి క్వాలిటీతో ప్రింట్ బయటికి రావడం నిర్మాత మతిపోయేలా చేసింది. కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు చేపట్టినా అప్పటికే నష్టం దేశం దాటిపోయింది. గత ఏడాది మలయాళం సినిమాలతో మొదలైన ఈ వైరస్ ఆ తర్వాత తమిళంకు పాకి, ఇటు కన్నడ నుంచి తెలుగుకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఏకంగా భాషతో సంబంధం లేకుండా నాకందరూ ఒకటే అనే స్థాయిలో ఆన్ లైన్ వేదికగా జడలు విరబోసుకుని డాన్సులు ఆడుతోంది.

గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్, పుష్ప 2, కంగువ, సూక్ష్మదర్శిని, యువి ఇలా దీని బారిన పడిన సినిమాల లిస్టు రాసుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది కానీ ఇక ఆలోచించాల్సింది భవిష్యత్తు కార్యాచరణ గురించి. 2025లో చాలా ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వంద నుంచి అయిదారు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టినవి మే నెల నుంచి క్యూ కట్టబోతున్నాయి. హరిహరవీరమల్లు, విశ్వంభర, మిరాయ్, వార్ 2, కన్నప్ప, ఘాటీ, అఖండ 2, సంబరాల ఏటిగట్టు ఒకటి రెండు కాదు ఏకంగా పదికి పైగా ఇలాంటివి థియేటర్లకు రాబోతున్నాయి. వీటి ముందున్న అతి పెద్ద సవాల్ పైరసీ కాకుండా చూసుకోవడమే.

విదేశాల నుంచి ఇదంతా జరుగుతున్నా అసలు ఒరిజినల్ క్వాలిటీ ప్రింట్ ఎక్కడి నుంచి బయటికి వస్తుందనేది కని పెట్టాలి. ఎడిటింగ్ రూమ్, డిజిటల్ అప్లోడర్స్, ఫారిన్ కు పంపే హార్డ్ డిస్కులు, విఎఫెక్స్ కంపెనీలకు ఇచ్చే కాపీ, ప్రైవేట్ స్క్రీనింగ్ చెకింగ్ కోసం నిర్మాత పెట్టుకునే వెర్షన్ ఇలా రకరకాల మార్గాలు ఒక సినిమా బయటికి లీకయ్యేందుకు ఉన్నాయి. అసలు తప్పు ఎక్కడ జరుగుతోందనేది గుర్తిస్తే చేసిందెవరో కనుక్కుని పట్టుకోవచ్చు. అలా కాకుండా రిలీజ్ టైంలో హడావిడి చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల లాభం లేదు. దిల్ రాజు అన్నట్టు అందరూ ఇది తమ సమస్యగా భావించి కంటిన్యూగా పోరాడితే తప్ప పరిష్కారం దొరకదు.  

This post was last modified on March 31, 2025 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

19 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago