అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక స్థాయికి చేరుకుంది. విడుదలకు కొన్నిగంటల ముందే మంచి క్వాలిటీతో ప్రింట్ బయటికి రావడం నిర్మాత మతిపోయేలా చేసింది. కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు చేపట్టినా అప్పటికే నష్టం దేశం దాటిపోయింది. గత ఏడాది మలయాళం సినిమాలతో మొదలైన ఈ వైరస్ ఆ తర్వాత తమిళంకు పాకి, ఇటు కన్నడ నుంచి తెలుగుకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఏకంగా భాషతో సంబంధం లేకుండా నాకందరూ ఒకటే అనే స్థాయిలో ఆన్ లైన్ వేదికగా జడలు విరబోసుకుని డాన్సులు ఆడుతోంది.
గేమ్ ఛేంజర్, తండేల్, డాకు మహారాజ్, పుష్ప 2, కంగువ, సూక్ష్మదర్శిని, యువి ఇలా దీని బారిన పడిన సినిమాల లిస్టు రాసుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది కానీ ఇక ఆలోచించాల్సింది భవిష్యత్తు కార్యాచరణ గురించి. 2025లో చాలా ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వంద నుంచి అయిదారు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టినవి మే నెల నుంచి క్యూ కట్టబోతున్నాయి. హరిహరవీరమల్లు, విశ్వంభర, మిరాయ్, వార్ 2, కన్నప్ప, ఘాటీ, అఖండ 2, సంబరాల ఏటిగట్టు ఒకటి రెండు కాదు ఏకంగా పదికి పైగా ఇలాంటివి థియేటర్లకు రాబోతున్నాయి. వీటి ముందున్న అతి పెద్ద సవాల్ పైరసీ కాకుండా చూసుకోవడమే.
విదేశాల నుంచి ఇదంతా జరుగుతున్నా అసలు ఒరిజినల్ క్వాలిటీ ప్రింట్ ఎక్కడి నుంచి బయటికి వస్తుందనేది కని పెట్టాలి. ఎడిటింగ్ రూమ్, డిజిటల్ అప్లోడర్స్, ఫారిన్ కు పంపే హార్డ్ డిస్కులు, విఎఫెక్స్ కంపెనీలకు ఇచ్చే కాపీ, ప్రైవేట్ స్క్రీనింగ్ చెకింగ్ కోసం నిర్మాత పెట్టుకునే వెర్షన్ ఇలా రకరకాల మార్గాలు ఒక సినిమా బయటికి లీకయ్యేందుకు ఉన్నాయి. అసలు తప్పు ఎక్కడ జరుగుతోందనేది గుర్తిస్తే చేసిందెవరో కనుక్కుని పట్టుకోవచ్చు. అలా కాకుండా రిలీజ్ టైంలో హడావిడి చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల లాభం లేదు. దిల్ రాజు అన్నట్టు అందరూ ఇది తమ సమస్యగా భావించి కంటిన్యూగా పోరాడితే తప్ప పరిష్కారం దొరకదు.
This post was last modified on March 31, 2025 6:38 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…