విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఫలితం లేకపోయింది. ఐతే హీరోయిన్ వేషాలు తగ్గిపోయిన టైంలో నందమూరి బాలకృష్ణకు జోడీగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’లో నటించింది. అందులో ఆమెది ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర. సినిమా ఆడలేదు కానీ.. విద్యా చాలా బాగా నటించి మెప్పించింది. బాలయ్యతో ఆమెకు జోడీ కూడా బాగానే కుదిరింది.
రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు మళ్లీ విద్యాతో బాలయ్య నటించబోతున్నట్లు సమాాచారం. ఆయన కొత్త చిత్రం ‘అఖండ-2’లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. విద్యా కథానాయికల్లో ఒకరా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆమె ఈ చిత్రంలో నటిస్తుండడం మాత్రం వాస్తవమట.
‘అఖండ’కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ‘అఖండ’ ఓటీటీలో రిలీజయ్యాక హిందీ ప్రేక్షకులు కూడా ఎగబడి చూశారు. దీంతో ఈసారి సీక్వెల్ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఆర్టిస్టులను కూడా వేర్వేరు భాషల నుంచి తీసుకుంటున్నారు. విద్యా నటిస్తే హిందీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతారు.
14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఒక భారీ సెట్లో యాక్షన్ ఘట్టాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 28న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ సమయానికి సినిమా రెడీ అవడం సందేహమే అని.. ఏడాది చివరికి వాయిదా పడొచ్చని అంటున్నారు.
This post was last modified on March 31, 2025 9:13 pm
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…