విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఫలితం లేకపోయింది. ఐతే హీరోయిన్ వేషాలు తగ్గిపోయిన టైంలో నందమూరి బాలకృష్ణకు జోడీగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’లో నటించింది. అందులో ఆమెది ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర. సినిమా ఆడలేదు కానీ.. విద్యా చాలా బాగా నటించి మెప్పించింది. బాలయ్యతో ఆమెకు జోడీ కూడా బాగానే కుదిరింది.
రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు మళ్లీ విద్యాతో బాలయ్య నటించబోతున్నట్లు సమాాచారం. ఆయన కొత్త చిత్రం ‘అఖండ-2’లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. విద్యా కథానాయికల్లో ఒకరా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆమె ఈ చిత్రంలో నటిస్తుండడం మాత్రం వాస్తవమట.
‘అఖండ’కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ‘అఖండ’ ఓటీటీలో రిలీజయ్యాక హిందీ ప్రేక్షకులు కూడా ఎగబడి చూశారు. దీంతో ఈసారి సీక్వెల్ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఆర్టిస్టులను కూడా వేర్వేరు భాషల నుంచి తీసుకుంటున్నారు. విద్యా నటిస్తే హిందీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతారు.
14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఒక భారీ సెట్లో యాక్షన్ ఘట్టాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 28న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ సమయానికి సినిమా రెడీ అవడం సందేహమే అని.. ఏడాది చివరికి వాయిదా పడొచ్చని అంటున్నారు.
This post was last modified on March 31, 2025 9:13 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…