నిన్న క్రిష్ 4 ప్రకటన వచ్చింది. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం బడ్జెట్ కారణంగా ఇది క్యాన్సిలవుతుందనే వార్తల నేపథ్యంలో హఠాత్తుగా అనౌన్స్ మెంట్ ఇవ్వడం గమనార్హం. అయితే అసలు ట్విస్టు ఇది కాదు. హీరో హృతిక్ రోషనే స్వయంగా దర్శకత్వం వహించేందుకు పూనుకోవడం. ఎందుకంటే ఇది చాలా పెద్ద రిస్క్. సాధారణంగా బాలీవుడ్ స్టార్లు డైరెక్షన్ కు దూరంగా ఉంటారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి దిగ్గజాలు దీని జోలికి వెళ్ళలేదు. అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ తో ఋజువు చేసుకున్నాడు కానీ ఇప్పుడు సీక్వెల్ బాధ్యతలు వేరొకరికి అప్పగించాడు.
ఇలాంటి నేపథ్యంలో హృతిక్ రోషన్ ఇంత పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏదో పెద్దగా బడ్జెట్ అక్కర్లేని రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటే ఏదో అనుకోవచ్చు. కానీ క్రిష్ 4 అలా కాదు. పేపర్ మీద నాలుగు వందల కోట్లకు పైగా డిమాండ్ చేస్తోందట. దానికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవసరమయ్యే సబ్జెక్టు. రాజమౌళి పీక్స్ కి చేరని టైంలో క్రిష్ అద్భుతాలు చేసింది కానీ ఆ తర్వాత రోబో, 2.0, ఆర్ఆర్ఆర్ లాంటివి గ్రాండియర్ పదానికి కొత్త అర్థం తీసుకొచ్చాయి. సో క్రిష్ 4 వీటిని దాటే స్థాయిలో ఉంటే తప్ప ఆడియన్స్ అంగీకరించరు. ఇది ఒక రకంగా పెను సవాల్ లాంటిది.
మరి హృతిక్ దీన్ని ఎంతమేరకు నెరవేరుస్తాడో చూడాలి. క్రిష్ 4 క్యాస్టింగ్, టీమ్ తదితర వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి 2027 విడుదలని టార్గెట్ గా పెట్టుకోబోతున్నారని ముంబై టాక్. హిందీలో ఏమో కానీ తెలుగులో నటించడంతో పాటు దర్శకత్వం చేస్తూ బ్లాక్ బస్టర్లు సాధించిన హీరోల లిస్టు చెప్పుకోదగ్గదే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ ఎన్నో మర్చిపోలేని క్లాసిక్స్ ఇచ్చారు. ఇప్పటి జనరేషన్ లో విశ్వక్ సేన్ ఒక్కడే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సిద్దు జొన్నలగడ్డ రైటర్ గా తన ముద్ర చూపిస్తున్నాడు. రెండో తరం సీనియర్ స్టార్లలో ఎవరూ దీని జోలికి వెళ్ళలేదు.
This post was last modified on March 29, 2025 10:33 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…