సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇటీవలే తమన్ డాకు మహారాజ్ ఈవెంట్ లో ఎంతగా బాధ పడ్డాడో చూశాం. ఏకంగా చిరంజీవి సైతం దీని గురించి స్పందించడం చర్చనీయాంశం అయ్యింది.
వీళ్ళొక్కరే కాదు గతంలో అనసూయ, సమంతా, చిన్మయి శ్రీపాద, విజయ్ దేవరకొండ ఇలా ఎందరో ట్రోలింగ్ బారిన పడిన వాళ్ళే. అందుకే ఏదైనా షేర్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. గీత రచయిత కృష్ణకాంత్ తాజాగా చెప్పిన అనుభవం వింటే మరోసారి అర్థమవుతుంది.
రాధే శ్యామ్ విడుదల టైంలో ఆడియో ఆల్బమ్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మాస్ సినిమా కాదు ప్రేమకథని తెలిసినా కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఊహించుకున్నారు. దీంతో ఒక సాంగ్ రావడం ఆలస్యం దాని మీద నెగటివిటీ దావానలంలా పాకిపోయింది. దీంతో కృష్ణకాంత్ తాను ఎంతో ఇష్టపడి రాసిన ‘నే నిన్నటి రవి నువ్వు రేపటి శశి’ని షేర్ చేసుకోవడానికి భయపడ్డారు.
సాహిత్యం అర్థం కాదేమోననే ఉద్దేశంతో ఆగిపోయారు. తీరా చూస్తే సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. మంచి పాటగా పేరు తెచ్చుకుంది. కానీ ముందే రావాల్సిన రీచ్ కేవలం సోషల్ మీడియా కారణంగా లేటయ్యింది.
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆచార్య వచ్చాక కొరటాల శివ ట్విట్టర్ నుంచి సెలవు తీసుకుని ప్రశాంతంగా దేవర మీద ఫోకస్ పెట్టారు. ప్రభాస్ కు ఇప్పటికీ ఎక్స్ లో అకౌంట్ లేదు. బాలకృష్ణ ఈ వ్యవహారాల మీద ఆసక్తి చూపించలేదు. కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
సెలబ్రిటీలను నెగటివిటీ ఆ స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. విలువైన సమయాన్ని యూవత అలా వృథా చేసుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేకపోయినా ఈ ధోరణి మాత్రం తగ్గడం లేదు సరికదా అంతకంతా పెరుగుతోంది. దీన్ని కట్టడి చేయడం అసాధ్యం. స్వీయ విచక్షణ తప్ప వేరే మార్గం లేదు.
This post was last modified on January 22, 2025 9:08 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…