పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు. కానీ మదగజరాజా దాన్ని బ్రేక్ చేసి ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేయడం దక్షిణాది ట్రేడ్ లో అతి పెద్ద సెన్సేషన్ అయ్యింది. కేవలం తమిళంలో మాత్రమే రిలీజైనప్పటికీ ఈ స్థాయి స్పందన దర్శక నిర్మాతలు ఊహించలేదు.
గత కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ తో ఎన్నో యాక్షన్, ఎలివేషన్ చిత్రాలు చేస్తున్న విశాల్ వాటి ద్వారా అందుకోని విజయం ఇప్పుడు రుచి చూడటంతో అతని ఆనందాన్ని పట్టుకోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఇప్పుడీ ఫలితం ప్రభావం ఎన్నింటినో బూజు దులిపేలా చేస్తోంది.
కోలీవుడ్ లో ప్రస్తుతం ముప్పై దాకా సినిమాలు వివిధ దశల్లో మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. విక్రమ్ – గౌతమ్ మీనన్ కాంబోలో రూపొందిన ధృవ నక్షతం మీద ఏడేళ్లుగా కోట్ల రూపాయల పెట్టుబడులు వడ్డీల భారంతో కృంగిపోతున్నాయి. కస్టడీ ఫేమ్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన పార్టీని థియేటర్లలో వదిలేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అన్నీ విఫలమే.
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇదం పొరుళ్ ఎవల్ (విజయ్ సేతుపతి), నరగాసురన్ (అరవింద్ స్వామి-శ్రేయ), అగ్ని సిరగుగల్ (విజయ్ ఆంటోనీ), కా ది ఫారెస్ట్ (ఆండ్రియా) వాటిలో మరికొన్ని.
ఇవి కాకూండా సతురంగ వెట్టై 2 (త్రిష – అరవిందస్వామి), మాయ (ఎస్జె సూర్య), గర్జనై (త్రిష), ది టెస్ట్ (నయనతార – మాధవన్ – సిద్దార్థ్), వలిమయిల్ (విజయ్ ఆంటోనీ), గాంధీ టాక్స్ (విజయ్ సేతుపతి), ఫ్లాష్ బ్యాక్ (ప్రభుదేవా) ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. ఇక్కడ ప్రస్తావించినవి కేవలం మన తెలుగు ఆడియన్స్ కూడా పరిచయమున్న ఆర్టిస్టులవి మాత్రమే.
అన్నీ కుదిరితే డబ్బింగ్ వెర్షన్ల రూపంలో మన దగ్గరికి వస్తాయి. మదగజరాజా ఫలితం చూశాక ఇప్పుడు వీటి దర్శక నిర్మాతలు ఎలాగైనా బయటికి తీసుకొచ్చే మార్గాల మీద దృష్టి పెడుతున్నారట. దాదాపు అన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నావే కావడం గమనార్హం.
This post was last modified on January 22, 2025 6:42 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…