అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడికి చేరాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల వారూ అక్కడికి వచ్చారు. నాలుగు రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాల్లో ఒక్కో క్షణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు ట్రాఫిక్ జాం అయితే…గుండెలు గుబగుబలాడటం ఖాయమే. ఆ ప్రమాదం వద్దనుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్… ఆ ట్రాఫిక్ చిక్కులను తప్పించుకునేందుకు ఏకంగా కాలి నడకకు శ్రీకారం చుట్టారు.
దావోస్ లో బుధవారం నాటి సమావేశాలకు బయలుదేరే సందర్భంగా నారా లోకేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు యువ అధికారులతో కలిసి లోకేశ్… వణికించే చలిలో చకచకా నడుస్తూ సాగిపోతున్నారు. లోకేశ్ నడుస్తూ సాగుతుంటే… ఆయనను వెంబడించేందుకు ఓ అధికారి నడకను కాస్తా పరుగుగా మార్చాల్సి వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేవీ గమనించని ఎంచక్కా జేబుల్లో చేతులు పెట్టేసుకుని లోకేశ్ చకచకా సాగిపోయారు.
అయినా దావోస్ లా లోకేశ్ కాలి నడకన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే… దావోస్ సదస్సుకు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందట. ఇక సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందట. ఈ ట్రాఫిక్ చిక్కులు ఎందుకు అని లోకేశ్ భావించినట్లున్నారు. అందుకే కాలి నడకన లెఫ్ట్ రైైట్ అంటూ సాగిపోయినట్లున్నారు.
ఇన్వెస్టర్లతో మీటింగ్ కు ఆలస్యం కావద్దు కదా. అందుకే… ముందు చూపుగా అలా కాలి నడకరన ఆయన చకచకా వెళ్లిపోయారు. ఇటీవలి అమెరికా పర్యటనలోనూ లోకేశ్ ఇలాగే కాలి నడకక సాగిపోయిన వీడియో సోషల్ లో వైరల్ గా మారిపోయింది. తాజాగా దావోస్ లోనూ ఆయన కాలి నడకన… అది కూడా గడ్డ కట్టే చలిలోనూ అలా కాలి నడకన సాగిపోతున్న వీడియో ఇట్టే వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 23, 2025 9:31 am
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…