అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడికి చేరాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల వారూ అక్కడికి వచ్చారు. నాలుగు రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాల్లో ఒక్కో క్షణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు ట్రాఫిక్ జాం అయితే…గుండెలు గుబగుబలాడటం ఖాయమే. ఆ ప్రమాదం వద్దనుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్… ఆ ట్రాఫిక్ చిక్కులను తప్పించుకునేందుకు ఏకంగా కాలి నడకకు శ్రీకారం చుట్టారు.
దావోస్ లో బుధవారం నాటి సమావేశాలకు బయలుదేరే సందర్భంగా నారా లోకేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు యువ అధికారులతో కలిసి లోకేశ్… వణికించే చలిలో చకచకా నడుస్తూ సాగిపోతున్నారు. లోకేశ్ నడుస్తూ సాగుతుంటే… ఆయనను వెంబడించేందుకు ఓ అధికారి నడకను కాస్తా పరుగుగా మార్చాల్సి వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేవీ గమనించని ఎంచక్కా జేబుల్లో చేతులు పెట్టేసుకుని లోకేశ్ చకచకా సాగిపోయారు.
అయినా దావోస్ లా లోకేశ్ కాలి నడకన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే… దావోస్ సదస్సుకు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందట. ఇక సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందట. ఈ ట్రాఫిక్ చిక్కులు ఎందుకు అని లోకేశ్ భావించినట్లున్నారు. అందుకే కాలి నడకన లెఫ్ట్ రైైట్ అంటూ సాగిపోయినట్లున్నారు.
ఇన్వెస్టర్లతో మీటింగ్ కు ఆలస్యం కావద్దు కదా. అందుకే… ముందు చూపుగా అలా కాలి నడకరన ఆయన చకచకా వెళ్లిపోయారు. ఇటీవలి అమెరికా పర్యటనలోనూ లోకేశ్ ఇలాగే కాలి నడకక సాగిపోయిన వీడియో సోషల్ లో వైరల్ గా మారిపోయింది. తాజాగా దావోస్ లోనూ ఆయన కాలి నడకన… అది కూడా గడ్డ కట్టే చలిలోనూ అలా కాలి నడకన సాగిపోతున్న వీడియో ఇట్టే వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 23, 2025 9:31 am
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…