గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. యాక్షన్ కథలను, లవ్ స్టోరీలను అద్భుతంగా ప్రెజెంట్ చేయగల నైపుణ్యం ఆయన సొంతం. చెలి, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ప్రేమకథలను ఎంత హృద్యంగా తీశాడో.. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ కథలను అంత పకడ్బందీగా తీసి తన ప్రత్యేకతను చాటాడు గౌతమ్.
ఐతే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యాక్సన్ మూవీ ‘ధృవ నక్షత్రం’ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. గౌతమ్కు చెందిన ఫాంటన్ ఫిలిమ్స్ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడమే అందుక్కారణం. దీని వల్ల ఆయన వేరే సినిమాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. ఐతే వాటిలో ఒక్కోదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ.. ‘ధృవనక్షత్రం’ సంగతే ఎటూ తేలకుండా పోయింది.
కొన్నేళ్ల పాటు అసలు వార్తల్లో లేని ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబరు 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు గౌతమ్. కానీ అది సాధ్యపడలేదు. సినిమా చుట్టూ ముసురుకున్న ఆర్థిక వివాదాలు పరిష్కారం కాక అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా బయటికి రావడం కష్టమే అని అందరూ ఫిక్సయ్యారు. కానీ ఇప్పుడు గౌతమ్ మళ్లీ ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చాడు. ఇంతకుముందు ప్రకటించినట్లే సినిమాకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ‘ధృవ నక్షత్రం’ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ పండక్కి తమిళంలో విక్రమ్ నుంచే ‘వీర ధీర సూరన్’ సినిమా రావాల్సింది. కానీ అది వాయిదా పడింది. అలాగే అజిత్ మూవీ ‘విడాముయర్చి’ సైతం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో తమిళంలో పొంగల్ కళ తప్పింది. ఈ పండక్కి దశాబ్దం కిందటి విశాల్ సినిమా ‘మదగజరాజా’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ధృవనక్షత్రం’ రూపంలో మరో పాత సినిమా పోటీలోకి వచ్చింది. ఐతే ‘ధృవనక్షత్రం’ విషయంలో ఇంతకుముందు జరిగింది దృష్టిలో ఉంచుకుని చూస్తే 11న థియేటర్లో బొమ్మ పడే వరకు గ్యారెంటీ లేనట్లే.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…