గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. యాక్షన్ కథలను, లవ్ స్టోరీలను అద్భుతంగా ప్రెజెంట్ చేయగల నైపుణ్యం ఆయన సొంతం. చెలి, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ప్రేమకథలను ఎంత హృద్యంగా తీశాడో.. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ కథలను అంత పకడ్బందీగా తీసి తన ప్రత్యేకతను చాటాడు గౌతమ్.
ఐతే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యాక్సన్ మూవీ ‘ధృవ నక్షత్రం’ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. గౌతమ్కు చెందిన ఫాంటన్ ఫిలిమ్స్ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడమే అందుక్కారణం. దీని వల్ల ఆయన వేరే సినిమాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. ఐతే వాటిలో ఒక్కోదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ.. ‘ధృవనక్షత్రం’ సంగతే ఎటూ తేలకుండా పోయింది.
కొన్నేళ్ల పాటు అసలు వార్తల్లో లేని ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబరు 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు గౌతమ్. కానీ అది సాధ్యపడలేదు. సినిమా చుట్టూ ముసురుకున్న ఆర్థిక వివాదాలు పరిష్కారం కాక అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా బయటికి రావడం కష్టమే అని అందరూ ఫిక్సయ్యారు. కానీ ఇప్పుడు గౌతమ్ మళ్లీ ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చాడు. ఇంతకుముందు ప్రకటించినట్లే సినిమాకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ‘ధృవ నక్షత్రం’ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ పండక్కి తమిళంలో విక్రమ్ నుంచే ‘వీర ధీర సూరన్’ సినిమా రావాల్సింది. కానీ అది వాయిదా పడింది. అలాగే అజిత్ మూవీ ‘విడాముయర్చి’ సైతం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో తమిళంలో పొంగల్ కళ తప్పింది. ఈ పండక్కి దశాబ్దం కిందటి విశాల్ సినిమా ‘మదగజరాజా’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ధృవనక్షత్రం’ రూపంలో మరో పాత సినిమా పోటీలోకి వచ్చింది. ఐతే ‘ధృవనక్షత్రం’ విషయంలో ఇంతకుముందు జరిగింది దృష్టిలో ఉంచుకుని చూస్తే 11న థియేటర్లో బొమ్మ పడే వరకు గ్యారెంటీ లేనట్లే.
This post was last modified on January 8, 2025 10:46 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…