నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు. బాగా సన్నబడిపోయి స్టేజి మీద మాట్లాడుతున్నప్పుడు మైకు పట్టుకున్న చెయ్యి వణుకుతూ ఉండటం చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మొన్నటికి మొన్న మార్క్ ఆంటోనీ, రత్నం సినిమాల్లో విశాల్ ఆరోగ్యంగా ఉన్నాడు.
తుప్పరివాలన్ 2 (డిటెక్టీవ్)ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. అలాంటిది హఠాత్తుగా ఇంత అనారోగ్యం ఎలా కలిగిందనే సందేహం రావడం సహజం. చెన్నై మీడియా ప్రకారం విశాల్ తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని అయినా వచ్చాడని చెబుతున్నారు.
కేవలం జ్వరమే అయితే పర్వాలేదు కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం మంచి చికిత్స తీసుకోవడం అవసరం. ఎందుకంటే గతంలో విశాల్ ఇలా కనిపించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఎక్కడైనా సరే దూసుకెళ్ళిపోతూ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడే హీరో ఇలా కావడం ఎవరికైనా టెన్షన్ కలిగించే విషయమే.
12 సంవత్సరాల తర్వాత రిలీజవుతున్న మదగజరాజకు సోషల్ మీడియాలో అనూహ్యంగా మద్దతు దక్కుతోంది. సంతానం కామెడీ, అంజలి – వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్, విజయ్ ఆంటోనీ సంగీతం తదితర అంశాలు క్రమంగా హై పెంచుతున్నాయి. సుందర్ సి దర్శకుడు కావడం మరో ప్లస్.
ప్రస్తుతం విశాల్ తుప్పరివాలన్ 2 మాత్రమే చేస్తున్నారు. మరో రెండు సినిమాలు ఫైనల్ చేయాల్సి ఉంది. మదగజరాజకు తొలుత హైప్ ఉండదేమో అనుకున్నారు కానీ అనూహ్యంగా బజ్ రావడం పట్ల సదరు టీమ్ సంతోషంగా ఉంది. పాత సినిమా అయినా ఎంటర్ టైన్మెంట్ ఫ్రెష్ గా ఉంటుందని సుందర్ హామీ ఇస్తున్నారు.
అజిత్ విడాముయార్చి తప్పుకోవడం వల్ల ఒక్కసారిగా ఏడెనిమిది తమిళ చిత్రాలు మూకుమ్మడిగా బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నాయి. బడ్జెట్ పరంగా గేమ్ ఛేంజర్ ఒకటే పెద్ద ప్యాన్ ఇండియా మూవీ. హీరో కోణంలో నెక్స్ట్ విశాల్ నిలుస్తాడు. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో.
This post was last modified on January 6, 2025 10:29 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…