ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ప్రతిసారి విపరీతంగా ఆలస్యం కావడం గతంలో చూశాం. అయితే గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సానుకూల ధోరణి వల్ల నిర్మాతలకు పెద్ద టెన్షన్ తప్పుతోంది. తాజాగా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పర్మిషన్లు ఆరు రోజుల ముందుగా అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఇవ్వడం విశేషం.
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ వేడుక ప్రారంభం కాక ముందే జిఓని విడుదల చేయడం మంచి పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. సో ఫ్యాన్స్ కు సంబంధించి మొదటి టెన్షన్ అయితే పూర్తిగా తీరిపోయింది.
అర్ధరాత్రి ఒంటి గంటకు వేయబోయే బెనిఫిట్ షో టికెట్ ఒక్కటికి 600 రూపాయలు నిర్ణయించిన ప్రభుత్వం డిసెంబర్ 10 ఉదయం 4 గంటలకు అదనంగా ఒక షోతో పాటు మొత్తం ఆ రోజు ఆరు షోలకు అనుమతి మంజూరు చేసింది. ఆపై డిసెంబర్ 11 నుంచి 23 దాకా రోజుకు అయిదు షోల చొప్పున వేసుకోవచ్చు.
దీనికి గాను మల్టీప్లెక్సులు ప్రతి టికెట్ మీద 175 రూపాయలు, సింగల్ స్క్రీన్లు 135 రూపాయలు పెంచుకోవచ్చు. అంటే రెగ్యులర్ షోలకు మల్టీప్లెక్సుల్లో 352 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 282 రూపాయల దాకా ధర ఉంటుంది. డిసెంబర్ 24 నుంచి సాధారణ రేట్లు అమల్లోకి వస్తాయి.
ఇప్పుడు తెలంగాణ సర్కారు ఎలాంటి వెసులుబాటు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సంధ్య థియేటర్ ఉదంతం తర్వాత కాస్త కఠినంగానే ఉన్న సిఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు బృందం ఎలా ఒప్పించనుందనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 అంత కాకపోయినా కాస్త రీజనబుల్ గా పెంపు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏపీలో ఇచ్చేశారు కాబట్టి ఇక్కడా అలాంటి ఫలితాన్నీ ఇండస్ట్రీ ఆశిస్తోంది. మరి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంకు ఎంత పెంపుని నిర్మాతలు అడుగుతారో వేచి చూడాలి. మొత్తానికి రోజుల తరబడి వెయిట్ చేయించకుండా త్వరగా చర్యలు తీసుకోవడం శుభపరిణామం.
This post was last modified on January 4, 2025 7:29 pm
డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…
ఒకప్పుడు యుఎస్లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్గా తయారైంది. మన…
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…