Movie News

AP గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు – గ్రౌండ్ సెట్

ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ప్రతిసారి విపరీతంగా ఆలస్యం కావడం గతంలో చూశాం. అయితే గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సానుకూల ధోరణి వల్ల నిర్మాతలకు పెద్ద టెన్షన్ తప్పుతోంది. తాజాగా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పర్మిషన్లు ఆరు రోజుల ముందుగా అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఇవ్వడం విశేషం.

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ వేడుక ప్రారంభం కాక ముందే జిఓని విడుదల చేయడం మంచి పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. సో ఫ్యాన్స్ కు సంబంధించి మొదటి టెన్షన్ అయితే పూర్తిగా తీరిపోయింది.

అర్ధరాత్రి ఒంటి గంటకు వేయబోయే బెనిఫిట్ షో టికెట్ ఒక్కటికి 600 రూపాయలు నిర్ణయించిన ప్రభుత్వం డిసెంబర్ 10 ఉదయం 4 గంటలకు అదనంగా ఒక షోతో పాటు మొత్తం ఆ రోజు ఆరు షోలకు అనుమతి మంజూరు చేసింది. ఆపై డిసెంబర్ 11 నుంచి 23 దాకా రోజుకు అయిదు షోల చొప్పున వేసుకోవచ్చు.

దీనికి గాను మల్టీప్లెక్సులు ప్రతి టికెట్ మీద 175 రూపాయలు, సింగల్ స్క్రీన్లు 135 రూపాయలు పెంచుకోవచ్చు. అంటే రెగ్యులర్ షోలకు మల్టీప్లెక్సుల్లో 352 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 282 రూపాయల దాకా ధర ఉంటుంది. డిసెంబర్ 24 నుంచి సాధారణ రేట్లు అమల్లోకి వస్తాయి.

ఇప్పుడు తెలంగాణ సర్కారు ఎలాంటి వెసులుబాటు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సంధ్య థియేటర్ ఉదంతం తర్వాత కాస్త కఠినంగానే ఉన్న సిఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు బృందం ఎలా ఒప్పించనుందనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 అంత కాకపోయినా కాస్త రీజనబుల్ గా పెంపు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఏపీలో ఇచ్చేశారు కాబట్టి ఇక్కడా అలాంటి ఫలితాన్నీ ఇండస్ట్రీ ఆశిస్తోంది. మరి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంకు ఎంత పెంపుని నిర్మాతలు అడుగుతారో వేచి చూడాలి. మొత్తానికి రోజుల తరబడి వెయిట్ చేయించకుండా త్వరగా చర్యలు తీసుకోవడం శుభపరిణామం.

This post was last modified on January 4, 2025 7:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

39 seconds ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

1 hour ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

4 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago