పెరుగు వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అయితే పెరుగు తియ్యగా ఉంటేనే తినడానికి చాలామంది ఇష్టపడతారు.. కాస్త పులిసిన పెరుగుని పడేస్తారు. అయితే అలా వ్యర్థంగా పడేసే పెరుగులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మీకు తెలుసా? సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ పుల్లని పెరుగు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి అవి ఏమిటి? ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..
నార్మల్ గా పుల్లని పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ అనుకుంటారు.. ఇందులో కొంత నిజం కూడా ఉంది. అయితే సరియైన పద్ధతిలో ఈ పుల్లని పెరుగును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం ఉండదు. పెరుగు పులవడానికి ముఖ్య కారణం అందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇది సహజంగా పెరుగును సంరక్షించడానికి జరిగే ఓ ప్రక్రియ. అయితే మరీ పుల్లగా వాసనతో కూడుకున్న పెరుగుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
వంటలు:
ఇక పెరుగు పుల్లగా ఉంటే డైరెక్ట్ గా తినడానికి కుదరదు.. మరి అలాంటప్పుడు పెరుగుని మనం వంటకాలలో ఉపయోగించవచ్చు. చికెన్, మటన్ లాంటివి మ్యారినేట్ చేయడానికి కాస్త పులిసిన పెరుగు అద్భుతంగా ఉంటుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం మాంసంలో ఉన్న ప్రోటీన్ లను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి అది త్వరగా ఉడుకుతుంది.దీన్ని ఉపయోగించడం వల్ల కూరకి మంచి రుచి కూడా వస్తుంది. మసాలా కూరల్లో కూడా పుల్లని పెరుగు కలపడం వల్ల రుచి పెరుగుతుంది. కేక్స్, మఫిన్లు, బ్రెడ్ వంటివి వాటికి పుల్లని పెరుగును వాడితే అవి ఎంతో మృదువుగా వస్తాయి.
బ్యూటీ:
పుల్లని పెరుగు మన చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మృదుత్వాన్ని అందిస్తుంది. పుల్లని పెరుగుని ఉపయోగించి పలు రకాల కెమికల్ ఫ్రీ ఫేస్ మాస్క్ ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చు. ఎండాకాలం సన్బర్న్, చమట కాయలపై పుల్లని పెరుగు రాయడం వల్ల అవి చాలా వరకు తగ్గుతాయి. పుల్లని పెరుగు వారానికి ఒకసారి జుట్టుకు మసాజ్ చేసి.. తలస్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా మెరిసిపోతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ , డాండ్రపు సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా డైటీషియన్ ను సంప్రదించడం మంచిది.
This post was last modified on January 4, 2025 7:23 pm
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…
తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…
వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…