పెరుగు వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అయితే పెరుగు తియ్యగా ఉంటేనే తినడానికి చాలామంది ఇష్టపడతారు.. కాస్త పులిసిన పెరుగుని పడేస్తారు. అయితే అలా వ్యర్థంగా పడేసే పెరుగులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మీకు తెలుసా? సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ పుల్లని పెరుగు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి అవి ఏమిటి? ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..
నార్మల్ గా పుల్లని పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ అనుకుంటారు.. ఇందులో కొంత నిజం కూడా ఉంది. అయితే సరియైన పద్ధతిలో ఈ పుల్లని పెరుగును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం ఉండదు. పెరుగు పులవడానికి ముఖ్య కారణం అందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇది సహజంగా పెరుగును సంరక్షించడానికి జరిగే ఓ ప్రక్రియ. అయితే మరీ పుల్లగా వాసనతో కూడుకున్న పెరుగుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
వంటలు:
ఇక పెరుగు పుల్లగా ఉంటే డైరెక్ట్ గా తినడానికి కుదరదు.. మరి అలాంటప్పుడు పెరుగుని మనం వంటకాలలో ఉపయోగించవచ్చు. చికెన్, మటన్ లాంటివి మ్యారినేట్ చేయడానికి కాస్త పులిసిన పెరుగు అద్భుతంగా ఉంటుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం మాంసంలో ఉన్న ప్రోటీన్ లను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి అది త్వరగా ఉడుకుతుంది.దీన్ని ఉపయోగించడం వల్ల కూరకి మంచి రుచి కూడా వస్తుంది. మసాలా కూరల్లో కూడా పుల్లని పెరుగు కలపడం వల్ల రుచి పెరుగుతుంది. కేక్స్, మఫిన్లు, బ్రెడ్ వంటివి వాటికి పుల్లని పెరుగును వాడితే అవి ఎంతో మృదువుగా వస్తాయి.
బ్యూటీ:
పుల్లని పెరుగు మన చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మృదుత్వాన్ని అందిస్తుంది. పుల్లని పెరుగుని ఉపయోగించి పలు రకాల కెమికల్ ఫ్రీ ఫేస్ మాస్క్ ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చు. ఎండాకాలం సన్బర్న్, చమట కాయలపై పుల్లని పెరుగు రాయడం వల్ల అవి చాలా వరకు తగ్గుతాయి. పుల్లని పెరుగు వారానికి ఒకసారి జుట్టుకు మసాజ్ చేసి.. తలస్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా మెరిసిపోతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ , డాండ్రపు సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా డైటీషియన్ ను సంప్రదించడం మంచిది.
This post was last modified on January 4, 2025 7:23 pm
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…