Movie News

అఖిల్ కోసం అదిరిపోయే విలన్

ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. విపరీతమైన హైప్ మధ్య రిలీజైన తన తొలి చిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్‌కు పేలవ ఆరంభం లభించింది. రెండో చిత్రం ‘హలో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టరే అయింది. మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’తో కూడా లాభం లేకపోయింది. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడినా.. తర్వాతి సినిమా ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ అయి అఖిల్‌ కెరీర్‌ను మళ్లీ కిందికి తీసుకెళ్లిపోయింది.

ఈ స్థితిలో యువి క్రియేషన్స్‌లో ఓ భారీ చిత్రానికి ప్లానింగ్ జరిగింది కానీ.. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడం అక్కినేని అభిమానులను నిరాశకు గురి చేసింది. తర్వాత ఏంటి అని అనుకుంటుండగా.. మరోసారి అక్కినేని నాగార్జున రంగంలోకి దిగాడు. ‘హలో’ తర్వాత ఆయన మళ్లీ కొడుకు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు.

కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీసి మెప్పించిన మురళీ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ చేయబోతున్న సినిమాను నాగ్ నిర్మిస్తున్నాడు. ఇది ప్రేమకథ మిళితమైన థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఇందులో విలన్ పాత్రకు అదిరిపోయే ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కామ్ 1992తో గొప్ప పేరు సంపాదించిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రతినాయక పాత్ర చేయబోతున్నాడట.

స్కామ్ 1992లో సటిల్ పెర్ఫామెన్స్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రతీక్. అతను తెలుగులో అరంగేట్రం చేయనుండడం పట్ల ఎగ్జైట్ అవుతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు. త్వరలోనే సినిమా లాంచింగ్ ఉంటుంది. అప్పుడు కాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని వివరాలు బయటికి వస్తాయి.

Kumar

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

43 minutes ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

1 hour ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

2 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

3 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

3 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

3 hours ago