ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. విపరీతమైన హైప్ మధ్య రిలీజైన తన తొలి చిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్కు పేలవ ఆరంభం లభించింది. రెండో చిత్రం ‘హలో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టరే అయింది. మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’తో కూడా లాభం లేకపోయింది. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడినా.. తర్వాతి సినిమా ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ అయి అఖిల్ కెరీర్ను మళ్లీ కిందికి తీసుకెళ్లిపోయింది.
ఈ స్థితిలో యువి క్రియేషన్స్లో ఓ భారీ చిత్రానికి ప్లానింగ్ జరిగింది కానీ.. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడం అక్కినేని అభిమానులను నిరాశకు గురి చేసింది. తర్వాత ఏంటి అని అనుకుంటుండగా.. మరోసారి అక్కినేని నాగార్జున రంగంలోకి దిగాడు. ‘హలో’ తర్వాత ఆయన మళ్లీ కొడుకు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు.
కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీసి మెప్పించిన మురళీ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ చేయబోతున్న సినిమాను నాగ్ నిర్మిస్తున్నాడు. ఇది ప్రేమకథ మిళితమైన థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఇందులో విలన్ పాత్రకు అదిరిపోయే ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కామ్ 1992తో గొప్ప పేరు సంపాదించిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రతినాయక పాత్ర చేయబోతున్నాడట.
స్కామ్ 1992లో సటిల్ పెర్ఫామెన్స్తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రతీక్. అతను తెలుగులో అరంగేట్రం చేయనుండడం పట్ల ఎగ్జైట్ అవుతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు. త్వరలోనే సినిమా లాంచింగ్ ఉంటుంది. అప్పుడు కాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని వివరాలు బయటికి వస్తాయి.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…