ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. విపరీతమైన హైప్ మధ్య రిలీజైన తన తొలి చిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్కు పేలవ ఆరంభం లభించింది. రెండో చిత్రం ‘హలో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టరే అయింది. మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’తో కూడా లాభం లేకపోయింది. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడినా.. తర్వాతి సినిమా ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ అయి అఖిల్ కెరీర్ను మళ్లీ కిందికి తీసుకెళ్లిపోయింది.
ఈ స్థితిలో యువి క్రియేషన్స్లో ఓ భారీ చిత్రానికి ప్లానింగ్ జరిగింది కానీ.. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడం అక్కినేని అభిమానులను నిరాశకు గురి చేసింది. తర్వాత ఏంటి అని అనుకుంటుండగా.. మరోసారి అక్కినేని నాగార్జున రంగంలోకి దిగాడు. ‘హలో’ తర్వాత ఆయన మళ్లీ కొడుకు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు.
కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీసి మెప్పించిన మురళీ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ చేయబోతున్న సినిమాను నాగ్ నిర్మిస్తున్నాడు. ఇది ప్రేమకథ మిళితమైన థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఇందులో విలన్ పాత్రకు అదిరిపోయే ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కామ్ 1992తో గొప్ప పేరు సంపాదించిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రతినాయక పాత్ర చేయబోతున్నాడట.
స్కామ్ 1992లో సటిల్ పెర్ఫామెన్స్తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రతీక్. అతను తెలుగులో అరంగేట్రం చేయనుండడం పట్ల ఎగ్జైట్ అవుతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు. త్వరలోనే సినిమా లాంచింగ్ ఉంటుంది. అప్పుడు కాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని వివరాలు బయటికి వస్తాయి.
This post was last modified on January 4, 2025 6:07 pm
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…