Movie News

అఖిల్ కోసం అదిరిపోయే విలన్

ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. విపరీతమైన హైప్ మధ్య రిలీజైన తన తొలి చిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్‌కు పేలవ ఆరంభం లభించింది. రెండో చిత్రం ‘హలో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టరే అయింది. మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’తో కూడా లాభం లేకపోయింది. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడినా.. తర్వాతి సినిమా ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ అయి అఖిల్‌ కెరీర్‌ను మళ్లీ కిందికి తీసుకెళ్లిపోయింది.

ఈ స్థితిలో యువి క్రియేషన్స్‌లో ఓ భారీ చిత్రానికి ప్లానింగ్ జరిగింది కానీ.. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడం అక్కినేని అభిమానులను నిరాశకు గురి చేసింది. తర్వాత ఏంటి అని అనుకుంటుండగా.. మరోసారి అక్కినేని నాగార్జున రంగంలోకి దిగాడు. ‘హలో’ తర్వాత ఆయన మళ్లీ కొడుకు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు.

కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీసి మెప్పించిన మురళీ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ చేయబోతున్న సినిమాను నాగ్ నిర్మిస్తున్నాడు. ఇది ప్రేమకథ మిళితమైన థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఇందులో విలన్ పాత్రకు అదిరిపోయే ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కామ్ 1992తో గొప్ప పేరు సంపాదించిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రతినాయక పాత్ర చేయబోతున్నాడట.

స్కామ్ 1992లో సటిల్ పెర్ఫామెన్స్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రతీక్. అతను తెలుగులో అరంగేట్రం చేయనుండడం పట్ల ఎగ్జైట్ అవుతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు. త్వరలోనే సినిమా లాంచింగ్ ఉంటుంది. అప్పుడు కాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని వివరాలు బయటికి వస్తాయి.

This post was last modified on January 4, 2025 6:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

9 minutes ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

5 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

11 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

11 hours ago