Movie News

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి చిత్రం ‘జెంటిల్‌మ్యాన్’ నుంచి ఎన్నో సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. శంకర్ ప్రైమ్ ఫాంలో ఉన్నపుడు ఆయనతో సినిమా చేయాలని చాలామంది టాలీవుడ్ స్టార్లు ప్రయత్నించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘రోబో’ ఆడియో వేడుకలో వెల్లడించారు. కానీ అది సాధ్యపడలేదు.

ఐతే చిరుకు కుదరకపోయినా ఆయన తనయుడు రామ్ చరణ్.. శంకర్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు. వీరి కలయికలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. మధ్యలో శంకర్ నుంచి వచ్చిన ‘ఇండియన్-2’ డిజాస్టర్ కావడం కూడా దీని మీద ప్రతికూల ప్రభావం చూపింది. అయినా ‘గేమ్ చేంజర్’ అన్ని అడ్డంకులనూ అధిగమించి బ్లాక్ బస్టర్ అవుతుందని టీం నమ్ముతోంది.

ఈ సినిమాకు సంబంధించి యుఎస్‌లో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో శంకర్ సైతం పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన తెలుగు ఎంట్రీ ఇంత ఆలస్యం కావడం గురించి మాట్లాడారు. తెలుగు హీరోలతో సినిమా చేయాలని చాలా ముందు నుంచే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ముందుగా చిరంజీవితో సినిమా కోసం గతంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదన్నారు. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం ట్రై చేశానన్నారు. అదీ వర్కవుట్ కాలేదని.. ఇక కరోనా టైంలో ప్రభాస్‌తో సినిమా కోసం సీరియస్‌గా ప్రయత్నం జరిగిందని శంకర్ వెల్లడించారు.

తమ మధ్య కథా చర్చలు కూడా జరిగాయన్నారు. చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉందని, అలా ‘గేమ్ చేంజర్’ కార్యరూపం దాల్చిందని శంకర్ వ్యాఖ్యానించారు. తెలుగులో తాను సినిమా చేస్తే ఒక్కడు, పోకిరి తరహాలో చేయాలనుకున్నానని.. అందులో తన మార్కు ఉండాలనుకున్నానని.. అలా వచ్చిందే తడవుగా‘గేమ్ చేంజర్’ అని.. ఇందులో చరణ్ చాలా సటిల్‌గా, అద్భుతంగా నటించాడని శంకర్ తెలిపాడు.

Kumar

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

6 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

9 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

9 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

10 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

10 hours ago