సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు తాజాగా మరో హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ సాయం లేకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నారని వైద్యులు వెల్లడించారు. తెల్ల రక్త కణాలతోపాటు మిగతా రక్తకణాల సంఖ్య మెరుగుపడుతోందని చెప్పారు.
ఆహారం తీసుకోగలుగుతున్నాడని అన్నారు. అయితే, జ్వరం తగ్గలేదని, నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. కాగా, శ్రీ తేజ్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ రోజు ఆస్పత్రిలో పరామర్శించారు. శ్రీ తేజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. శ్రీ తేజ్ తండ్రికి నిర్మాత నవీన్ ఆ చెక్కును అందించారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో రూ.50 లక్షల చెక్ను నిర్మాతలు అందించారు.
మరోవైపు, అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత చెబుతున్నారు. కాగా, శ్రీ తేజ్ను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ హాస్పిటల్ బిల్లు చెల్లింపు వ్యవహారంపై కూడా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆ వ్యవహారంపై శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ స్పందించారు. తాను శ్రీ తేజ్ ను ఆస్పత్రిలో చేర్చినపుడు రూ.50 వేలు మాత్రమే కట్టానని, ఆ తర్వాత హాస్పిటల్ బిల్లును ప్రభుత్వం, అల్లు అర్జున్ టీం పెట్టుకుందని భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on December 23, 2024 9:21 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…