Movie News

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు తాజాగా మరో హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ సాయం లేకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నారని వైద్యులు వెల్లడించారు. తెల్ల రక్త కణాలతోపాటు మిగతా రక్తకణాల సంఖ్య మెరుగుపడుతోందని చెప్పారు.

ఆహారం తీసుకోగలుగుతున్నాడని అన్నారు. అయితే, జ్వరం తగ్గలేదని, నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని కిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. కాగా, శ్రీ తేజ్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ రోజు ఆస్పత్రిలో పరామర్శించారు. శ్రీ తేజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. శ్రీ తేజ్ తండ్రికి నిర్మాత నవీన్ ఆ చెక్కును అందించారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో రూ.50 లక్షల చెక్‌ను నిర్మాతలు అందించారు.

మరోవైపు, అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత చెబుతున్నారు. కాగా, శ్రీ తేజ్‌ను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ హాస్పిటల్ బిల్లు చెల్లింపు వ్యవహారంపై కూడా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆ వ్యవహారంపై శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ స్పందించారు. తాను శ్రీ తేజ్ ను ఆస్పత్రిలో చేర్చినపుడు రూ.50 వేలు మాత్రమే కట్టానని, ఆ తర్వాత హాస్పిటల్ బిల్లును ప్రభుత్వం, అల్లు అర్జున్ టీం పెట్టుకుందని భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

42 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago