విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు రాకుండా బయ్యర్లు డీసెంట్ వసూళ్లతో గట్టెక్కినట్టు ట్రేడ్ మాట్లాడుకుంది. తమిళం అంత ఘనవిజయం సాధించకపోయినా సీక్వెల్ మీద టాలీవుడ్ జనాల్లో అంచనాలు పెంచడంలో దర్శకుడు వెట్రిమారన్ సక్సెసయ్యారు. అందుకే విడుదల పార్ట్ 2కి మంచి రిలీజ్ వచ్చేలా చూసుకున్నారు. కానీ తీరా చూస్తే పార్ట్ 2 మంత్రం పని చేసినట్టు కనిపించడం లేదు. మందకొడిగా వస్తున్న కలెక్షన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అర్థం కాని యుఐకే ఎక్కువ ఆదరణ దక్కడం విశేషం.
ఈసారి విడుదల పార్ట్ 2 అంతగా కనెక్ట్ కాకపోవడానికి కారణాలున్నాయి. పార్ట్ 1 తరహాలో ఇందులో డెప్త్ లేదు. డ్రామా సరిపోలేదు. విజయ్ సేతుపతి పోషించిన పెరుమాళ్ జీవితాన్ని డీటెయిల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకోవడం ల్యాగ్ పెంచింది. పైగా మంజు వారియర్ తో ప్రేమకథ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సూరికి ప్రాధాన్యం తగ్గిపోవడం, సుదీర్ఘమైన డైలాగులు, జస్ట్ పర్వాలేదనిపించే ఇళయరాజా సంగీతం, రిపీట్ అనిపించే సీన్లు ఇలా బోలెడు మైనస్సులు అడ్డుపడ్డాయి. క్లాస్ ఆడియన్స్ సంగతి పక్కనపెడితే మాస్ జనాలకు ఎక్కేలా కాన్సెప్ట్ ని డిజైన్ చేయలేకపోవడం దెబ్బ కొట్టింది.
ఫైనల్ గా చెప్పాలంటే విడుదల పార్ట్ 2 కోలీవుడ్ లో జెండా పాతొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం డౌటే. మొదటి వీకెండ్ కూడా సోసోగానే ముగిసింది. కొన్ని బిసి సెంటర్స్ లో అదనంగా ఇచ్చిన స్క్రీన్లను తగ్గించి పుష్ప 2, ముఫాసా, యుఐకి కేటాయించిన వైనం కనిపించింది. అయినా తమిళ నేటివిటీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ దాకా కొట్టొచ్చినట్టు ఆధిపత్యం చెలాయిస్తే తెలుగు పబ్లిక్ కి కనెక్ట్ కావడం కష్టం. దీనికి 2 గంటల 42 నిమిషాల నిడివి ఎక్కువనుకుంటే ఓటిటి వెర్షన్ లో ఎడిట్ చేసి పక్కన పెట్టిన మరో గంట అదనంగా జోడిస్తారట. వెట్రిమారనే స్వయంగా ఈ విషయం చెప్పి షాక్ ఇవ్వడం గమనార్హం.
This post was last modified on December 23, 2024 8:51 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…