Trends

భార్యతో అక్రమ సంబంధం.. మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశాడు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి వైఎస్సార్ కడపజిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నోడి సంగతి చూసేందుకు అనూహ్య రీతిలో రియాక్టు అయ్యాడో భర్త. ఈ ఘటనలో రిలేషన్ పెట్టుకున్న అధికారి చనిపోగా.. భార్య తీవ్ర గాయాల బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సినిమాల్లో కూడా ఈ తరహా సీన్ చూసింది లేదు. అసలేం జరిగిందంటే..

వైఎస్సార్ కడప జిల్లాలోని వేముల మండలం కొత్తపల్లిలో ఈ ఫాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. అక్కడి స్థానిక వీఆర్వో నరసింహకు సుబ్బలక్ష్మమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని గుర్తించాడు ఆమె భర్త బాబు. తనను మోసం చేసిన భార్యను.. ఆమె ప్రియుడిని కడతేర్చాలని భర్త ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా గగుర్పాటుకు గురయ్యేలా రివేంజ్ కార్యక్రమానికి ప్లాన్ చేశాడు.

భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వీఆర్వో నరసింహ తన ఇంట్లో తన మంచం మీద తన భార్యతో నిద్రిస్తున్న వేళ.. ఆ మంచం కిందనే డిటోనేటర్లను అమర్చాడు. ఇవేమీ తెలియని నరసింహ ఎంచక్కా సుబ్బలక్ష్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు మంచం మీద పడుకొని సేద తీరుతున్న వేళలో.. డిటోనేటర్లను ఒక్కసారిగా పేల్చేశాడు భర్త బాబు. దీంతో ఆ ధాటికి వీఆర్వో నరసింహ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనలో సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందుతోంది. డిటోనేటర్లు పెట్టిన భర్త బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమన్న విషయాన్ని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు.

This post was last modified on September 30, 2024 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago