Trends

ముఖేషే నెంబర్ 1..రూ. 6.58 లక్షల కోట్ల సంపద

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే దేశంలో అత్యంత కుబేరుడుగా నిలిచారు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ మొదటిస్ధానంలో నిలబడటం వరుసగా తొమ్మిదోసారి. బహుశా జియో టెలికాం, జియో ఫైబర్, ఆయిల్, రీటైల్ తదితర రంగాల్లోని షేర్లను అమ్మటం వల్ల ముఖేష్ కు ఎదురు లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఏడాది వ్యవధిలో ముఖేష్ సంపద 73 శాతం పెరిగి రూ. 6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈయన తర్వాత రెండోస్ధానంలో హిందుజాల కుటుంబ ఆస్తుల విలువ రూ. 1.43 లక్షల కోట్లు కావటం గమనార్హం. అంటే మొదటి, రెండోస్ధానాల్లో ఉన్న వారి సంపద విలువ మధ్య వ్యత్యాసం దాదాపు రూ. 5 లక్షల కోట్లు.

భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ స్ధాయిలో కూడా ముఖేష్ అంబానీ కంపెనీల షేర్లు మంచి వాల్యుతోనే నడుస్తున్నాయి. ప్రతి ఏడాది, జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోని అత్యంత సంపన్నుల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ తో కలిసి హురూన్ సంస్ధ తయారు చేస్తుంది. ఈ సంస్ధ తయారుచేసిన జాబితాను విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో పాటు అనేక కారణాల రీత్యా సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరిగిపోతున్న విషయం తాజా జాబితాలో స్పష్టంగా కనిపిస్తోంది.

మొన్నటి ఆగష్టు 31వ తేదీకి దేశంలో వెయ్యి కోట్ల రూపాయల సంపదకన్నా ఎక్కువున్న 828 మంది భారతీయులను గుర్తించింది. అంటే ఈ జాబితా ప్రకారం కుబేరుల జాబితా ఏడాదికేడాది పెరుగుతున్న విషయం అర్ధమైపోతోంది. కుబేరులు అపరకుబేరులుగా సంపదను పెంచుకునిపోతుంటే పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారట. ఐదేళ్ళ క్రిందటితో పోల్చుకుంటే కుబేరుల జాబితా 6 శాతం పెరిగినట్లు హూరున్ సంస్ధ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

కుబేరుల జాబితాలో హెచ్సీఎల్ శివనాడార్ కుటుంబం రూ. 1.41 లక్షల కోట్లతో మూడోస్ధానం దక్కించుకుంది. రూ. 1.41 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ కుంటుంబం నాలుగోస్ధానం, రూ. 1.14 లక్షల కోట్ల సంపదతో విప్రో యాజమాన్యం అజీమ్ జీ ప్రేమ్ జీ కుటుంబం ఐదోస్ధానంలో నిలిచింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో సైరస్ పూనావాల రూ. 94300 కోట్లతో ఆరోస్దానంలో నిలిచారు. డీమార్ట్ వ్యవస్ధాపకుడు రాధాకృష్ణ దమానీ మొదటిసారిగా మొదటి పదిమంది కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. రూ. 87,200 కోట్లతో ఈయన ఏడోస్ధానం దక్కించుకున్నాడు.

కోటక్ మహీంద్ర ప్రమోటర్ ఉదయ్ కోటక్ రూ. 87 వేల కోట్లతో ఎనిమిదో స్ధానంలో నిలిచాడు. ఫార్మా కంపెనీల్లో ప్రముఖమైన సన్ ఫార్మా ప్రమోటర్ దలీప్ సింఘ్వి రూ. 84 వేల కోట్లతో తొమ్మిదోస్ధానం దక్కించుకున్నారు. గతంలో ఈయన 11వ స్ధానంలో ఉండేవారు. టాటాసన్స్ లో తమ వాటాలను మొత్తం అమ్మేసిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూపుకు చెందిన సైరస్ మిస్త్రీ రూ. 76 వేల కోట్లతో పదోస్ధానంలో నిలిచాడు. మొత్తం మీద భారతదేశం పేద దేశం అని పేరున్నా పారిశ్రామికవేత్తలైన కుబేరుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతోంది.

This post was last modified on September 30, 2020 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago