మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో మరో దుమారానికి కారణమయ్యింది. ఆ వేడుకకు రావడానికి సుకుమార్ భార్య తబిత ఆ సినిమా నిర్మాత కాబట్టి అనే కోణంలో బన్నీ అన్న మాటలు వేరే అర్థంలో వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాలకు వెళ్లి రావడం గురించి మరోసారి మెగా ఫ్యాన్స్ కొందరు తవ్వి తీస్తున్నారు. ఇక్కడితో ఆగడం లేదు. ఇవాళ రీ రిలీజ్ అయిన ఇంద్రలో శివాజీ పోషించిన క్యారెక్టర్ ని బన్నీకి ముడిపెడుతూ అక్కర్లేని ట్రోలింగ్ కి దారి తీస్తున్నారు. అలా అని ఐకాన్ స్టార్ అభిమానులు సైలెంట్ గా ఉండటం లేదు.
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఒకే సంక్రాంతికి రిలీజైన టైంలో చిరంజీవి మహేష్ బాబు ఈవెంట్ కి వెళ్లడం గురించి ప్రశ్నిస్తున్నారు. మరి మేనల్లుడు ఫంక్షన్ కి ఎందుకు రాలేదని కౌంటర్ వేస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత హీరో ఫ్యామిలీ అయినా సరే సినిమాకు సంబంధం లేని బయటి అతిథులను తీసుకురాడనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఆ టైంలో మహేష్ అభ్యర్థన మీద చిరు అక్కడికి వెళ్ళారు. అందులోనూ పాత ఫ్రెండ్ విజయశాంతి కీలక పాత్ర చేసింది కాబట్టి. అంతే తప్ప బన్నీకి పోటీగా ఏదో రెచ్చగొట్టాలని కాదనేది ఇటువైపు నుంచి వినిపిస్తున్న వెర్షన్.
ఎప్పుడో పది పదిహేనేళ్ల క్రితం బన్నీ, చిరు, చరణ్, పవన్ పలు సందర్భాల్లో అన్న వీడియోలను ఇప్పుడు తీసుకొచ్చి ఘనకార్యంగా ఫీలవుతున్న వాళ్లకు కొదవ లేదు. మాస్ భాషలో ఇవన్నీ చేయడం వల్ల చిరు, అల్లు కుటుంబాలకు రవ్వంత కూడా ఫరక్ పడదు. కేవలం ఫ్యాన్స్ తమ సంతృప్తి కోసం చేస్తూ టైం వేస్ట్ చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. పోనీ దీని ప్రభావం పుష్ప 2 మీద పడుతుందా అంటే నిజంగా సినిమా బాగుంటే ఎవరూ డ్యామేజ్ చేయలేరు. చెప్పను బ్రదర్ తర్వాత అల్లు అర్జున్ మీద ఆన్ లైన్ లో ఇంత చర్చ జరగడం బహుశా ఇది మూడోసారి అని చెప్పొచ్చు. కొన్నిరోజులు కొనసాగేలా ఉంది.
This post was last modified on August 22, 2024 6:24 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…