కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చనిపోవడం అందరినీ కలచివేసింది. నటుడిగా ఎంతో ప్రయత్నించి ఫెయిలైన అతను.. రాజకీయాల్లో అయినా వెలిగిపోవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు.
అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబం కూడా అతణ్ని దూరం పెట్టింది. ఇలా అనేక ఇబ్బందులు పడ్డ అతను.. హఠాత్తుగా చనిపోవడం అందరినీ బాధించింది. ఐతే తారకరత్న మరణానంతరం అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లల పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తారకరత్నను తలుచుకుని బాధ పడ్డారు. తన పిల్లలకు నందమూరి కుటుంబం నుంచి ఆశించిన ఆదరణ లేదని వాపోయారు.
నందమూరి కుటుంబానికి ఇష్టం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకోవడంతో తమను ఆ ఫ్యామిలీలో కలుపుకోలేదని ఆమె తెలిపారు. తారకరత్న మరణానంతరం ఒక్క బాలకృష్ణ మాత్రమే తమ బాగోగుల గురించి పట్టించుకున్నారని.. మద్దతుగా నిలుస్తూ వస్తున్నారని అలేఖ్య చెప్పారు.
తారకరత్నతో పెళ్లికి తమ కుటుంబం నుంచి ఎప్పుడూ అభ్యంతరం లేదని.. వాళ్ల నుంచి ఎప్పుడూ మద్దతు ఉందని చెప్పారు. కానీ నందమూరి కుటుంబం భవిష్యత్తులో అయినా.. తారకరత్న పిల్లలను దగ్గరికి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
అలేఖ్య.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత దగ్గర బంధువు. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో తాను కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చని ఆమె ఈ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చారు. మరి ఎంత కాదనుకున్నా ఆమె నందమూరి కుటుంబ సభ్యురాలే కాబట్టి.. తనకు తెలుగుదేశం పార్టీ అవకాశమిస్తుందా.. లేక అలేఖ్య చూపు వేరే పార్టీల వైపు వెళ్తుందా అన్నది చూడాలి.
This post was last modified on March 12, 2026 1:52 pm
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…