డ్రీమ్ ఎలెవన్.. ఇప్పుడు క్రికెట్ యువతను ఊపేస్తున్న గేమ్ యాప్. విదేశాల్లో వివిధ ఆటల మీద అధికారికంగా బెట్టింగ్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ మన దగ్గర బెట్టింగ్ మీద నిషేధం ఉంది. ఐతే డ్రీమ్ ఎలెవన్ ద్వారా బెట్టింగ్ చేయొచ్చు కానీ.. అది రెగ్యులర్గా సాగే బెట్టింగ్కు భిన్నం. రెండు జట్లు తలపడుతుంటే ఆ రెండింటి నుంచి నచ్చిన ఆటగాళ్లలో ఒక ఎలెవన్ తయారు చేసుకుని అందులో కెప్టెన్, వైస్ కెప్టెన్లను ఎంచుకుని (వీళ్లకు అదనపు పాయింట్లుంటాయి) డబ్బులు పెట్టిన బెట్టింగ్కు వెళ్లొచ్చు ఈ యాప్ ద్వారా.
దీన్ని పోలిన మరెన్నో యాప్స్ గత కొన్నేళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటి మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ ఏడాది చైనా సంస్థ ‘వివో’ ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటే దాని స్థానంలో హక్కులు రూ.250 కోట్లకు సొంతం చేసుకున్నది డ్రీమ్ ఎలెవన్ సంస్థే కావడం విశేషం. దీన్ని బట్టి ఈ యాప్ పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ సందర్భంగా రోజూ వందల కోట్లలో ఈ యాప్ ద్వారా బెట్టింగ్లు నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. చెన్నై ఆడే మ్యాచ్లకు వచ్చినపుడు బెట్టింగ్లు కట్టే ఎవ్వరూ కూడా ధోనీని తమ జట్టులోకి చేర్చుకోకుండా పక్కన పెట్టేస్తుండటం గమనార్హం. ట్రెండ్స్ చూస్తే ధోనీని అతి కొద్ది మంది మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా వ్యక్తిగత అభిమానంతో కావచ్చు. డ్రీమ్ ఎలెవన్ జట్లలో రెగ్యులర్గా ఉండే ఆటగాళ్లలో ధోనీకి స్థానం ఉండట్లేదు. మామూలుగా వికెట్ కీపర్లకు కచ్చితంగా చోటు ఇస్తుంటారు. కానీ ధోనీని మాత్రం పక్కన పెట్టేస్తుండటాన్ని బట్టి అతడి మీద అభిమానులు నమ్మకం కోల్పోయారని స్పష్టమవుతోంది.
తొలి మూడు మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్ చూశాక మరింతగా వాళ్లు నమ్మకం కోల్పోయి ఉంటారనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ధోనీకి ప్రతిదీ కలిసొచ్చేది. కానీ ఇప్పుడు తిరగబడుతోంది. అతను ఫెయిలవుతున్నాడు. జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. తొలి మ్యాచ్లో రాయుడి పుణ్యమా అని గెలిచింది కానీ.. చెన్నైకి ఈ సీజన్లో కష్టాలు తప్పవని.. ధోనీకి మున్ముందు గడ్డు రోజులు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను తన ప్రదర్శనను ఎలా మారుస్తాడో, జట్టునెలా నడిపిస్తాడో చూడాలి.
This post was last modified on September 27, 2020 6:39 am
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…