డ్రీమ్ ఎలెవన్.. ఇప్పుడు క్రికెట్ యువతను ఊపేస్తున్న గేమ్ యాప్. విదేశాల్లో వివిధ ఆటల మీద అధికారికంగా బెట్టింగ్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ మన దగ్గర బెట్టింగ్ మీద నిషేధం ఉంది. ఐతే డ్రీమ్ ఎలెవన్ ద్వారా బెట్టింగ్ చేయొచ్చు కానీ.. అది రెగ్యులర్గా సాగే బెట్టింగ్కు భిన్నం. రెండు జట్లు తలపడుతుంటే ఆ రెండింటి నుంచి నచ్చిన ఆటగాళ్లలో ఒక ఎలెవన్ తయారు చేసుకుని అందులో కెప్టెన్, వైస్ కెప్టెన్లను ఎంచుకుని (వీళ్లకు అదనపు పాయింట్లుంటాయి) డబ్బులు పెట్టిన బెట్టింగ్కు వెళ్లొచ్చు ఈ యాప్ ద్వారా.
దీన్ని పోలిన మరెన్నో యాప్స్ గత కొన్నేళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటి మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ ఏడాది చైనా సంస్థ ‘వివో’ ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటే దాని స్థానంలో హక్కులు రూ.250 కోట్లకు సొంతం చేసుకున్నది డ్రీమ్ ఎలెవన్ సంస్థే కావడం విశేషం. దీన్ని బట్టి ఈ యాప్ పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ సందర్భంగా రోజూ వందల కోట్లలో ఈ యాప్ ద్వారా బెట్టింగ్లు నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. చెన్నై ఆడే మ్యాచ్లకు వచ్చినపుడు బెట్టింగ్లు కట్టే ఎవ్వరూ కూడా ధోనీని తమ జట్టులోకి చేర్చుకోకుండా పక్కన పెట్టేస్తుండటం గమనార్హం. ట్రెండ్స్ చూస్తే ధోనీని అతి కొద్ది మంది మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా వ్యక్తిగత అభిమానంతో కావచ్చు. డ్రీమ్ ఎలెవన్ జట్లలో రెగ్యులర్గా ఉండే ఆటగాళ్లలో ధోనీకి స్థానం ఉండట్లేదు. మామూలుగా వికెట్ కీపర్లకు కచ్చితంగా చోటు ఇస్తుంటారు. కానీ ధోనీని మాత్రం పక్కన పెట్టేస్తుండటాన్ని బట్టి అతడి మీద అభిమానులు నమ్మకం కోల్పోయారని స్పష్టమవుతోంది.
తొలి మూడు మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్ చూశాక మరింతగా వాళ్లు నమ్మకం కోల్పోయి ఉంటారనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ధోనీకి ప్రతిదీ కలిసొచ్చేది. కానీ ఇప్పుడు తిరగబడుతోంది. అతను ఫెయిలవుతున్నాడు. జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. తొలి మ్యాచ్లో రాయుడి పుణ్యమా అని గెలిచింది కానీ.. చెన్నైకి ఈ సీజన్లో కష్టాలు తప్పవని.. ధోనీకి మున్ముందు గడ్డు రోజులు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను తన ప్రదర్శనను ఎలా మారుస్తాడో, జట్టునెలా నడిపిస్తాడో చూడాలి.
This post was last modified on September 27, 2020 6:39 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…