ఇప్పుడు ప్రపంచం దృష్టంతా బంగ్లాదేశ్ మీదే ఉంది. అక్కడ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకుని.. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాక, దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇండియాకు మంచి ఫ్రెండుగా పేరున్న హసీనా.. ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఆమె బ్రిటన్కు వెళ్లాలని అనుకున్నా ఆ దేశం ఇప్పుడే అక్కడికి రావొద్దని చెప్పడంతో ఢిల్లీలో ఉంటున్నారు.
హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న ముజీబ్ ఉర్ రెహమాన్ ప్రధానిగా ఉండగా ప్రవేశపెట్టిన స్వాతంత్ర్య సమర యోధుల రిజర్వేషన్ను ఇప్పటికీ కొనసాగిస్తుండడం.. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారి మనవళ్లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చూడడం యువతలో ఆగ్రహానికి కారణమైంది. దీని మీద కొన్ని నెలల కిందట మొదలైన అల్లర్లు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓవైపు పాకిస్థాన్, మరోవైపు అమెరికా ప్రతిపక్షాలకు పరోక్షంగా అండగా నిలుస్తూ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకునేందుకు కారణం కావడంతో హసీనా తప్పుకోక తప్పలేదు.
ఐతే రిజర్వేషన్ల అంశంలో హసీనా తీరు వివాదాస్పదం కావచ్చు కానీ.. ఆమెకు పాలకురాలిగా మంచి పేరుంది. తన హయాంలో బంగ్లాదేశ్ ఎంతో అభివృద్ధి చెందింది. సెక్యులర్ వాదిగా పేరున్న హసీనా హయాంలో బంగ్లాలో అన్ని మతాల వాళ్లు.. ముఖ్యంగా హిందువులు సురక్షితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు మత ఛాందస వాదులుగా పేరుంది. వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.
హసీనా వైదొలగ్గానే బంగ్లాలోని మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. హిందువుల ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొడవ చేయడం.. ఇళ్లను తగలబెట్టడం, ధ్వంసం చేయడం లాంటివి చేశారు. ఆలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అంతే కాక హిందువులను రోడ్ల మీదికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించి చంపుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏ కారణంతో హసీనాను పదవి నుంచి దించినప్పటికీ.. బంగ్లా మున్ముందు మత మౌఢ్యంలోకి వెళ్లబోతోందని.. అక్కడ పరిస్థితులు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తరహాలో మారబోతున్నాయని.. ఇకపై అక్కడ హిందువులు బతకడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 6, 2024 9:41 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…