ఇప్పుడు ప్రపంచం దృష్టంతా బంగ్లాదేశ్ మీదే ఉంది. అక్కడ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకుని.. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాక, దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇండియాకు మంచి ఫ్రెండుగా పేరున్న హసీనా.. ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఆమె బ్రిటన్కు వెళ్లాలని అనుకున్నా ఆ దేశం ఇప్పుడే అక్కడికి రావొద్దని చెప్పడంతో ఢిల్లీలో ఉంటున్నారు.
హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న ముజీబ్ ఉర్ రెహమాన్ ప్రధానిగా ఉండగా ప్రవేశపెట్టిన స్వాతంత్ర్య సమర యోధుల రిజర్వేషన్ను ఇప్పటికీ కొనసాగిస్తుండడం.. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారి మనవళ్లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చూడడం యువతలో ఆగ్రహానికి కారణమైంది. దీని మీద కొన్ని నెలల కిందట మొదలైన అల్లర్లు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓవైపు పాకిస్థాన్, మరోవైపు అమెరికా ప్రతిపక్షాలకు పరోక్షంగా అండగా నిలుస్తూ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకునేందుకు కారణం కావడంతో హసీనా తప్పుకోక తప్పలేదు.
ఐతే రిజర్వేషన్ల అంశంలో హసీనా తీరు వివాదాస్పదం కావచ్చు కానీ.. ఆమెకు పాలకురాలిగా మంచి పేరుంది. తన హయాంలో బంగ్లాదేశ్ ఎంతో అభివృద్ధి చెందింది. సెక్యులర్ వాదిగా పేరున్న హసీనా హయాంలో బంగ్లాలో అన్ని మతాల వాళ్లు.. ముఖ్యంగా హిందువులు సురక్షితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు మత ఛాందస వాదులుగా పేరుంది. వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.
హసీనా వైదొలగ్గానే బంగ్లాలోని మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. హిందువుల ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొడవ చేయడం.. ఇళ్లను తగలబెట్టడం, ధ్వంసం చేయడం లాంటివి చేశారు. ఆలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అంతే కాక హిందువులను రోడ్ల మీదికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించి చంపుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏ కారణంతో హసీనాను పదవి నుంచి దించినప్పటికీ.. బంగ్లా మున్ముందు మత మౌఢ్యంలోకి వెళ్లబోతోందని.. అక్కడ పరిస్థితులు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తరహాలో మారబోతున్నాయని.. ఇకపై అక్కడ హిందువులు బతకడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…