యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. మయంతి లాంగర్.. అర్చనా విజయ.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్ గా కనిపిస్తారో తెలిసిందే. ఐతే ఈ ముగ్గురిలో మయంతి ప్రత్యేకం.
మిగతా ఇద్దరూ ప్రధానంగా గ్లామర్ను నమ్ముకుంటే.. మయంతి గ్లామర్కు తోడు గొప్ప విషయ పరిజ్ఞానంతో, వాక్చాతుర్యంతో క్రీడాభిమానుల మనసుల్లోకి దూసుకెళ్లిపోయింది. దశాబ్దానికి పైగా వివిధ క్రీడా ఈవెంట్లలో తనదైన శైలి వ్యాఖ్యానంతో, ప్రెజెంటేషన్తో ఆకట్టుకుంటున్న మయంతి.. ముఖ్యంగా ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అందులో వచ్చే పేరుమోసిన మేల్ క్రికెట్ అనలిస్టులకు దీటుగా మయంతి తన క్రికెట్ పరిజ్ఞానంతో కట్టిపడేస్తుంటుంది. ఐతే ఈ భామ ఈసారి ఐపీఎల్కు అందుబాటులో లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. ఈ విషయాన్ని ప్రసాదరదారు అయిన స్టార్ స్పోర్ట్స్ ధ్రువీకరించింది కూడా.
మయంతి ఈసారి ఐపీఎల్కు దూరం కావడానికి ఆమె బిడ్డకు జన్మనివ్వడమే కారణం. ఆమె కర్ణాటక క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికీ చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. గత ఏడాది ఆమె గర్భవతి కాగా.. కొన్ని నెలల కిందటే ప్రసవించింది. ఈ సమయంలో బిడ్డను వదిలి ఐపీఎల్ కోసం మయంతి దుబాయ్ వెళ్లడం ఇబ్బందే. పైగా కరోనా భయం కూడా వెంటాడుతోంది. అందుకే ఐపీఎల్కు వెళ్లడం రిస్క్ అని భావించి ఆమె టోర్నీ యాంకరింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫమ్ చేసింది. మయంతి లేని ఐపీఎల్ వ్యాఖ్యానం కళ తప్పుతుందనడంలో సందేహం లేదు.
యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. మయంతి లాంగర్.. అర్చనా విజయ.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్ గా కనిపిస్తారో తెలిసిందే. ఐతే ఈ ముగ్గురిలో మయంతి ప్రత్యేకం.
మిగతా ఇద్దరూ ప్రధానంగా గ్లామర్ను నమ్ముకుంటే.. మయంతి గ్లామర్కు తోడు గొప్ప విషయ పరిజ్ఞానంతో, వాక్చాతుర్యంతో క్రీడాభిమానుల మనసుల్లోకి దూసుకెళ్లిపోయింది. దశాబ్దానికి పైగా వివిధ క్రీడా ఈవెంట్లలో తనదైన శైలి వ్యాఖ్యానంతో, ప్రెజెంటేషన్తో ఆకట్టుకుంటున్న మయంతి.. ముఖ్యంగా ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అందులో వచ్చే పేరుమోసిన మేల్ క్రికెట్ అనలిస్టులకు దీటుగా మయంతి తన క్రికెట్ పరిజ్ఞానంతో కట్టిపడేస్తుంటుంది. ఐతే ఈ భామ ఈసారి ఐపీఎల్కు అందుబాటులో లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. ఈ విషయాన్ని ప్రసాదరదారు అయిన స్టార్ స్పోర్ట్స్ ధ్రువీకరించింది కూడా.
మయంతి ఈసారి ఐపీఎల్కు దూరం కావడానికి ఆమె బిడ్డకు జన్మనివ్వడమే కారణం. ఆమె కర్ణాటక క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికీ చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. గత ఏడాది ఆమె గర్భవతి కాగా.. కొన్ని నెలల కిందటే ప్రసవించింది. ఈ సమయంలో బిడ్డను వదిలి ఐపీఎల్ కోసం మయంతి దుబాయ్ వెళ్లడం ఇబ్బందే. పైగా కరోనా భయం కూడా వెంటాడుతోంది. అందుకే ఐపీఎల్కు వెళ్లడం రిస్క్ అని భావించి ఆమె టోర్నీ యాంకరింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫమ్ చేసింది. మయంతి లేని ఐపీఎల్ వ్యాఖ్యానం కళ తప్పుతుందనడంలో సందేహం లేదు.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…