Political News

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి జ్వరానికి కూడా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాలంటే భయపడే రోజులు వచ్చాయి. ఇక గుండె జబ్బులు, పక్షవాతం వచ్చిన రోగులు సంగతి సరే సరి. రోగం కంటే హాస్పిటల్ బిల్లులే ఎక్కువగా భయపెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. సుశిక్షితులైన వైద్యులు, స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తుండటంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కానింగ్ కూడా అతి తక్కువ ఖర్చుకే చేస్తున్నారు. అవసరమైన వారికి తక్కువ ఫీజులతో శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దాంతో ఈ ఆసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు. గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి రోగులు తరలి వస్తున్నారు. రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది వరకు ఓపి నమోదవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో చికిత్స ఆలస్యం అవుతుందని రోగులు వాపోతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాయలేక ఇబ్బంది పడుతున్నారు.

ప్రజల ఇబ్బందిని గమనించిన జనసేన రాష్ట్రంలో మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభాకు ఒక ఎయిమ్స్ ఆసుపత్రి సరిపోవడం లేదని, జనాభా ప్రతిపాదిక, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని జనసేన కోరింది. కేంద్రం కనుక దీనికి ఒకే చెబితే రాష్ట్ర ప్రజలకు సరైన స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జనసేన చేసిన మేలు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు.

This post was last modified on August 6, 2026 10:24 pm

Share

Recent Posts

ఎంఎస్ సుబ్బులక్ష్మి… వాళ్ళిద్దరికీ పెద్ద ఛాలెంజ్

రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

35 minutes ago

మనోళ్లకు మండాడి అంతెందుకు నచ్చింది

నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…

1 hour ago

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

4 hours ago

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…

4 hours ago

రెండు కిక్ ఇచ్చాయి… ఒకటి షాక్ కొట్టింది

నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…

4 hours ago

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

5 hours ago