Political News

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి జ్వరానికి కూడా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాలంటే భయపడే రోజులు వచ్చాయి. ఇక గుండె జబ్బులు, పక్షవాతం వచ్చిన రోగులు సంగతి సరే సరి. రోగం కంటే హాస్పిటల్ బిల్లులే ఎక్కువగా భయపెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. సుశిక్షితులైన వైద్యులు, స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తుండటంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కానింగ్ కూడా అతి తక్కువ ఖర్చుకే చేస్తున్నారు. అవసరమైన వారికి తక్కువ ఫీజులతో శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దాంతో ఈ ఆసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు. గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి రోగులు తరలి వస్తున్నారు. రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది వరకు ఓపి నమోదవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో చికిత్స ఆలస్యం అవుతుందని రోగులు వాపోతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాయలేక ఇబ్బంది పడుతున్నారు.

ప్రజల ఇబ్బందిని గమనించిన జనసేన రాష్ట్రంలో మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభాకు ఒక ఎయిమ్స్ ఆసుపత్రి సరిపోవడం లేదని, జనాభా ప్రతిపాదిక, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని జనసేన కోరింది. కేంద్రం కనుక దీనికి ఒకే చెబితే రాష్ట్ర ప్రజలకు సరైన స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జనసేన చేసిన మేలు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు.

This post was last modified on August 6, 2026 10:24 pm

Share

Recent Posts

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

34 minutes ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

1 hour ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

1 hour ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

1 hour ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

2 hours ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago