ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. భారత్ ను తీవ్రంగానే ప్రభావితం చేసింది. ప్రస్తుతానికి అత్యధిక కేసుల నమోదులో దూసుకెళుతున్న భారత్ లో.. కరోనా వైరస్ నేపథ్యంలో చోటు చేసుకున్న విపరిణామాలకు సంబంధించి తాజాగా ఒక నివేదిక విడుదలైంది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో.. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయినట్లుగా వెల్లడైంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి.. సింఫుల్ గా చెప్పాలంటే సీఎంఐఈ వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి. మహమ్మారి వేళ.. మారిన పరిస్థితులకు తగ్గట్లు.. ఇంజనీర్లు.. ఫిజీషియన్లు.. ఉపాధ్యాయులు ఇలా వైట్ కాలర్ ఉద్యోగాలు ఏకంగా 66 లక్షలు పోయినట్లుగా తేల్చారు. 2016 తర్వాత ఇలాంటి పరిస్థితి లేదని తేల్చారు. అంతేకాదు.. తాజా పరిణామాల నేపథ్యంలో గడిచిన నాలుగేళ్లుగా సంపాదించిన లాభాలు మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లుగా తేల్చారు.
వీరే కాదు.. వివిధ పరిశ్రమకలు చెందిన 50 లక్షల మంది కార్మికులు కూడా ఉపాధిని కోల్పోయినట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కన్జ్యూమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా ఈ సంస్థ విశ్లేషన చేస్తుంది. నాలుగు నెలల్లో ఉపాధి పోగొట్టుకున్న వైట్ కాలర్ ఉద్యోగులకు.. ఉపాధి నైపుణ్యం ఉన్న వ్యాపారవేత్తల్ని కలుపలేదని.. వారిని కలిపితే అంకె భారీగా పెరుగుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. చిన్న తరహా పరిశ్రమల్లో తీవ్రమైన ఒత్తిడి ఉదని.. మధ్యతరహా పరిశ్రమలు సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. క్లరికల్ ఉద్యోగులు కరోనా వేళ.. పెద్దగా ప్రభావితం కాలేదన్నారు. వర్క్ ఫ్రం హోం దీనికి కారణంగా చెబుతున్నారు. ఏప్రిల్ లో 121 మిలియన్ల ఉద్యోగాలు పోయినట్లుగా సీఎంఐఈ గతంలో అంచనా వేసిందని.. వారిలో కొందరు ఆగస్టు నాటికి ఉద్యోగాలు పొందారని చెబుతున్నారు. అయితే.. అదేమీ భారీగా లేదంటున్నారు. ఏమైనా.. జీతాలు పొందే ఉద్యోగుల పరిస్థితి క్లిష్టంగానే ఉందన్నవిషయాన్ని తాజా విశ్లేషణ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on September 19, 2020 6:16 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…