ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. భారత్ ను తీవ్రంగానే ప్రభావితం చేసింది. ప్రస్తుతానికి అత్యధిక కేసుల నమోదులో దూసుకెళుతున్న భారత్ లో.. కరోనా వైరస్ నేపథ్యంలో చోటు చేసుకున్న విపరిణామాలకు సంబంధించి తాజాగా ఒక నివేదిక విడుదలైంది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో.. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయినట్లుగా వెల్లడైంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి.. సింఫుల్ గా చెప్పాలంటే సీఎంఐఈ వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి. మహమ్మారి వేళ.. మారిన పరిస్థితులకు తగ్గట్లు.. ఇంజనీర్లు.. ఫిజీషియన్లు.. ఉపాధ్యాయులు ఇలా వైట్ కాలర్ ఉద్యోగాలు ఏకంగా 66 లక్షలు పోయినట్లుగా తేల్చారు. 2016 తర్వాత ఇలాంటి పరిస్థితి లేదని తేల్చారు. అంతేకాదు.. తాజా పరిణామాల నేపథ్యంలో గడిచిన నాలుగేళ్లుగా సంపాదించిన లాభాలు మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లుగా తేల్చారు.
వీరే కాదు.. వివిధ పరిశ్రమకలు చెందిన 50 లక్షల మంది కార్మికులు కూడా ఉపాధిని కోల్పోయినట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కన్జ్యూమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా ఈ సంస్థ విశ్లేషన చేస్తుంది. నాలుగు నెలల్లో ఉపాధి పోగొట్టుకున్న వైట్ కాలర్ ఉద్యోగులకు.. ఉపాధి నైపుణ్యం ఉన్న వ్యాపారవేత్తల్ని కలుపలేదని.. వారిని కలిపితే అంకె భారీగా పెరుగుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. చిన్న తరహా పరిశ్రమల్లో తీవ్రమైన ఒత్తిడి ఉదని.. మధ్యతరహా పరిశ్రమలు సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. క్లరికల్ ఉద్యోగులు కరోనా వేళ.. పెద్దగా ప్రభావితం కాలేదన్నారు. వర్క్ ఫ్రం హోం దీనికి కారణంగా చెబుతున్నారు. ఏప్రిల్ లో 121 మిలియన్ల ఉద్యోగాలు పోయినట్లుగా సీఎంఐఈ గతంలో అంచనా వేసిందని.. వారిలో కొందరు ఆగస్టు నాటికి ఉద్యోగాలు పొందారని చెబుతున్నారు. అయితే.. అదేమీ భారీగా లేదంటున్నారు. ఏమైనా.. జీతాలు పొందే ఉద్యోగుల పరిస్థితి క్లిష్టంగానే ఉందన్నవిషయాన్ని తాజా విశ్లేషణ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on September 19, 2020 6:16 pm
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…