కొన్నేళ్ల కిందట ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో కుర్రాళ్లలో కలకలం రేపిన అమ్మాయి హెబ్బా పటేల్. ఆ సినిమాలో ఆమె బోల్డ్ రోల్ చేసి ప్రేక్షకుల్లోనే కాదు.. పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తర్వాతి కాలంలో హెబ్బా చేసిన సినిమాలు చాలా వరకు ఆమెలోని గ్లామర్ను ఎలివేట్ చేసినవే.
ఐతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఆమె దారి తప్పింది. ఎడాపెడా సినిమాలు ఒప్పుకుని పరాజయాలు ఎదుర్కొంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య మరీ వ్యాంప్ తరహా పాత్రలకు పరిమితం అయిపోతోంది హెబ్బా. ‘భీష్మ’లో ఆమె చేసిన కాల్ గర్ల్ క్యారెక్టర్ చూసి చాలామంది షాకయ్యారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’లో ఆమెది ఏటైపు పాత్రో తెలియదు మరి.
ఐతే హెబ్బా ఒప్పుకున్న కొత్త సినిమాలో మాత్రం తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన, ఎప్పుడూ పోషించని తరహా పాత్ర చేస్తోందని స్పష్టమవుతోంది. ఆ సినిమానే ‘ఓదెల రైల్వే స్టేషన్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ఠ సింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్టు అందించడం విశేషం. అతడితో ‘బెంగాల్ టైగర్’ సినిమాను నిర్మించిన కేకే రాధామోహన్ నిర్మాత. అశోక్ తేజ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
హెబ్బా విషయానికి వస్తే ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. అది కూడా కాటన్ చీరల్లో, మేకప్ లేకుండా ఆమె నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పచ్చటి పొలాల మధ్య ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిలా హెబ్బా కూర్చుని ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో హెబ్బాను చూసిన వాళ్లంతా ఇది ఆమేనా అని షాకవుతున్నారు. తన తొలి సినిమా ‘అలా ఎలా’లో పల్లెటూరి పాత్రే చేసినా.. దాంతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండబోతోందన్నది స్పష్టం.
This post was last modified on September 19, 2020 1:10 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…