కొన్నేళ్ల కిందట ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో కుర్రాళ్లలో కలకలం రేపిన అమ్మాయి హెబ్బా పటేల్. ఆ సినిమాలో ఆమె బోల్డ్ రోల్ చేసి ప్రేక్షకుల్లోనే కాదు.. పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తర్వాతి కాలంలో హెబ్బా చేసిన సినిమాలు చాలా వరకు ఆమెలోని గ్లామర్ను ఎలివేట్ చేసినవే.
ఐతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఆమె దారి తప్పింది. ఎడాపెడా సినిమాలు ఒప్పుకుని పరాజయాలు ఎదుర్కొంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య మరీ వ్యాంప్ తరహా పాత్రలకు పరిమితం అయిపోతోంది హెబ్బా. ‘భీష్మ’లో ఆమె చేసిన కాల్ గర్ల్ క్యారెక్టర్ చూసి చాలామంది షాకయ్యారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’లో ఆమెది ఏటైపు పాత్రో తెలియదు మరి.
ఐతే హెబ్బా ఒప్పుకున్న కొత్త సినిమాలో మాత్రం తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన, ఎప్పుడూ పోషించని తరహా పాత్ర చేస్తోందని స్పష్టమవుతోంది. ఆ సినిమానే ‘ఓదెల రైల్వే స్టేషన్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ఠ సింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్టు అందించడం విశేషం. అతడితో ‘బెంగాల్ టైగర్’ సినిమాను నిర్మించిన కేకే రాధామోహన్ నిర్మాత. అశోక్ తేజ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
హెబ్బా విషయానికి వస్తే ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. అది కూడా కాటన్ చీరల్లో, మేకప్ లేకుండా ఆమె నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పచ్చటి పొలాల మధ్య ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిలా హెబ్బా కూర్చుని ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో హెబ్బాను చూసిన వాళ్లంతా ఇది ఆమేనా అని షాకవుతున్నారు. తన తొలి సినిమా ‘అలా ఎలా’లో పల్లెటూరి పాత్రే చేసినా.. దాంతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండబోతోందన్నది స్పష్టం.
This post was last modified on September 19, 2020 1:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…