కొన్నేళ్ల కిందట ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో కుర్రాళ్లలో కలకలం రేపిన అమ్మాయి హెబ్బా పటేల్. ఆ సినిమాలో ఆమె బోల్డ్ రోల్ చేసి ప్రేక్షకుల్లోనే కాదు.. పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తర్వాతి కాలంలో హెబ్బా చేసిన సినిమాలు చాలా వరకు ఆమెలోని గ్లామర్ను ఎలివేట్ చేసినవే.
ఐతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఆమె దారి తప్పింది. ఎడాపెడా సినిమాలు ఒప్పుకుని పరాజయాలు ఎదుర్కొంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య మరీ వ్యాంప్ తరహా పాత్రలకు పరిమితం అయిపోతోంది హెబ్బా. ‘భీష్మ’లో ఆమె చేసిన కాల్ గర్ల్ క్యారెక్టర్ చూసి చాలామంది షాకయ్యారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’లో ఆమెది ఏటైపు పాత్రో తెలియదు మరి.
ఐతే హెబ్బా ఒప్పుకున్న కొత్త సినిమాలో మాత్రం తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన, ఎప్పుడూ పోషించని తరహా పాత్ర చేస్తోందని స్పష్టమవుతోంది. ఆ సినిమానే ‘ఓదెల రైల్వే స్టేషన్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ఠ సింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్టు అందించడం విశేషం. అతడితో ‘బెంగాల్ టైగర్’ సినిమాను నిర్మించిన కేకే రాధామోహన్ నిర్మాత. అశోక్ తేజ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
హెబ్బా విషయానికి వస్తే ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. అది కూడా కాటన్ చీరల్లో, మేకప్ లేకుండా ఆమె నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పచ్చటి పొలాల మధ్య ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిలా హెబ్బా కూర్చుని ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో హెబ్బాను చూసిన వాళ్లంతా ఇది ఆమేనా అని షాకవుతున్నారు. తన తొలి సినిమా ‘అలా ఎలా’లో పల్లెటూరి పాత్రే చేసినా.. దాంతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండబోతోందన్నది స్పష్టం.
This post was last modified on September 19, 2020 1:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…