Trends

శాంతి స్వరూప్ ఎందుకంత ప్రత్యేకం

ఇప్పటి జనరేషన్ కి అవగాహన లేదు కానీ న్యూస్ రీడర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శాంతి స్వరూప్ మరణ వార్త మీడియాలో హైలైట్ కావడం చూసి ఆశ్చర్యపోయే ఉంటారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ హైదరాబాద్ లో తుదిశ్వాస తీసుకున్న ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే గొప్పదనం అర్థమవుతుంది. శాంతి స్వరూప్ దూరదర్శన్ ఛానల్ లో 1983లో వార్తలు చదివే యాంకర్ గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. చెప్పాలంటే తెలుగులో మొట్టమొదటి వీడియో వ్యాఖ్యాత ఈయనే. తొలినాళ్లలో ఎంతో సవాలుతో కూడుకున్న జాబ్ ఇది.

అప్పట్లో టెక్నాలజీ, రకరకాల ఛానల్స్ ఉండేవి కాదు. దూరదర్శన్ మాత్రమే పరిమితంగా ప్రసారాలు చేసేది. రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చే వార్తల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాలంతా టీవీలకు అతుక్కుపోవడం అతిశయోక్తి కాదు. స్పష్టమైన ఉచ్చారణతో, ఎలాంటి దోషాలు లేకుండా ప్రసన్న వదనంతో శాంతి స్వరూప్ వార్తలు చదివే విధానం ఆయనకు అభిమానులకు సంపాదించి పెట్టింది. రోజూ కేంద్రం నుంచి వచ్చే పది పేజీల ఇంగ్లీష్ రిపోర్ట్ ని తెలుగులో స్వయంగా తర్జుమా చేసుకుని తప్పులు లేకుండా చదవడం చూసి అధికారులు ఆశ్చర్యపోయేవారు.

2011 వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్ లోనే కొనసాగారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ఆ వార్తలు చదవడం తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాలుగా ఆయన చెప్పుకుంటారు. ఎన్టీఆర్ కాలం చేసినప్పుడు సైతం తీవ్ర ఆవేదనను అణుచుకుని జనాలకు వార్తలు వినిపించడం సవాల్ గా భావించానని చెబుతారు. కొన్ని ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. వీలైనంత ఓవర్ ఫోకస్ కి దూరంగా ఉండే శాంతి స్వరూప్ 80, 90 దశకంలోని పిల్లలు, యూత్ తో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడా జ్ఞాపక స్వరం స్వర్గానికి వెళ్లిపోయింది.

This post was last modified on April 5, 2024 6:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

48 minutes ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago