Trends

శాంతి స్వరూప్ ఎందుకంత ప్రత్యేకం

ఇప్పటి జనరేషన్ కి అవగాహన లేదు కానీ న్యూస్ రీడర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శాంతి స్వరూప్ మరణ వార్త మీడియాలో హైలైట్ కావడం చూసి ఆశ్చర్యపోయే ఉంటారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ హైదరాబాద్ లో తుదిశ్వాస తీసుకున్న ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే గొప్పదనం అర్థమవుతుంది. శాంతి స్వరూప్ దూరదర్శన్ ఛానల్ లో 1983లో వార్తలు చదివే యాంకర్ గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. చెప్పాలంటే తెలుగులో మొట్టమొదటి వీడియో వ్యాఖ్యాత ఈయనే. తొలినాళ్లలో ఎంతో సవాలుతో కూడుకున్న జాబ్ ఇది.

అప్పట్లో టెక్నాలజీ, రకరకాల ఛానల్స్ ఉండేవి కాదు. దూరదర్శన్ మాత్రమే పరిమితంగా ప్రసారాలు చేసేది. రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చే వార్తల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాలంతా టీవీలకు అతుక్కుపోవడం అతిశయోక్తి కాదు. స్పష్టమైన ఉచ్చారణతో, ఎలాంటి దోషాలు లేకుండా ప్రసన్న వదనంతో శాంతి స్వరూప్ వార్తలు చదివే విధానం ఆయనకు అభిమానులకు సంపాదించి పెట్టింది. రోజూ కేంద్రం నుంచి వచ్చే పది పేజీల ఇంగ్లీష్ రిపోర్ట్ ని తెలుగులో స్వయంగా తర్జుమా చేసుకుని తప్పులు లేకుండా చదవడం చూసి అధికారులు ఆశ్చర్యపోయేవారు.

2011 వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్ లోనే కొనసాగారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ఆ వార్తలు చదవడం తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాలుగా ఆయన చెప్పుకుంటారు. ఎన్టీఆర్ కాలం చేసినప్పుడు సైతం తీవ్ర ఆవేదనను అణుచుకుని జనాలకు వార్తలు వినిపించడం సవాల్ గా భావించానని చెబుతారు. కొన్ని ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. వీలైనంత ఓవర్ ఫోకస్ కి దూరంగా ఉండే శాంతి స్వరూప్ 80, 90 దశకంలోని పిల్లలు, యూత్ తో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడా జ్ఞాపక స్వరం స్వర్గానికి వెళ్లిపోయింది.

Satya

Recent Posts

హమ్మయ్యా… కనకరాజుకి మోక్షం దొరికింది

విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…

11 minutes ago

పెద్దికి పెద్ద షాక్ అక్క‌డే..

గ‌త వారం భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్షెకుల ముందుకు వ‌చ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే భారీ…

2 hours ago

కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ!

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…

2 hours ago

శోక సంద్రంలో ‘విజయోత్సం’ వద్దబ్బా

ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…

4 hours ago

వైసీపీలో హాట్ టాపిక్‌: ఈ నియోజ‌క‌వ‌ర్గాల మాటేంటి ..!

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు నాయ‌కులు పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ త‌ర్వాత ప‌లువురు నేత‌లు..…

5 hours ago

స‌త్య‌నారాయ‌ణ సంత‌సం.. మాట నెర‌వేర్చిన చంద్ర‌బాబు!

స‌త్య‌నారాయ‌ణ గారూ.. రేపు సిద్ధాంతం వ‌స్తున్నా.. అక్క‌డ క‌లుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు స‌త్య‌నారాయ‌ణ‌కు ఆదివారం సీఎం చంద్ర‌బాబు…

5 hours ago