ఔను.. ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈ ప్రశ్నే ఎదురవుతోంది. మిమ్మ ల్ని ఎలా నమ్మాలండీ అంటూ.. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. దీనికి కారణం.. తన ఫోన్ కూడా ట్యాపిం గునకు గురైందని.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. తాము వదిలి పెట్టబోమని.. బీజేపీ ప్రభుత్వం కూసాలు కదిలిస్తుందని భారీ డైలాగులు పేల్చారు. అయితే, ఇప్పటికీ కేంద్రంలో ఉన్నదిబీజేపీనే కదా.. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది జనం టాక్.
ఇంతకీ కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి పెట్టినా… బీజేపీ వదలదని అన్నారు.
అయితే.. అసలు కిషన్ రెడ్డి చెబుతున్నట్టుగా ఆయన ఫోన్ ట్యాప్ అయింది.. దుబ్బాక , హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేశారు? కేంద్రంలో ఉన్నదిబీజేపీ ప్రభుత్వమే కదా.. మరి అక్కడే చెప్పి.. అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ ఎస్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనేది ప్రధాన ప్రశ్న. ఇదంతా చూస్తే.. కిషన్ రెడ్డిఏదో గేమ్ ఆడుతున్నారన్న వాదన అయితే.. బలంగా వినిపిస్తుండడం గమనార్హం. దీనిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
కొత్త శుక్రవారం వస్తే టాలీవుడ్ కు గంపెడు కొత్త సినిమాలు రావడం కొత్తేమి కాదు. కానీ వాటిలో కనీస స్థాయిలో…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయాలు వేడెక్కాయి. సభలో గొడవలు వద్దు, తుఫాన్ సృష్టించొద్దు అంటూ ప్రధాని నరేంద్ర…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద హీరో కిరణ్ అబ్బవరంతో పాటు టీమ్ మొత్తం…
గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఓ పెద్ద గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. డ్యాన్సర్స్ అసోసియేషన్లో రెండు వర్గాలు తయారై…
రామాయణం మనం ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసుంటాం. ఎందరో మహానటులు ఈ అద్భుత కావ్యంలో పాత్రలు పోషించి చిరస్మరణీయలుగా నిలిచిపోయారు.…
లెజెండ్ నుంచి జగపతిబాబు విలన్ గా మెప్పించడం మొదలయ్యాక ఆయనతో సోలో హీరోగా సినిమాలు తీసేందుకు నిర్మాతలు రిస్క్ చేయలేదు.…