Political News

కిష‌న్ రెడ్డిగారూ మీ మాట‌లు ఎలా న‌మ్మాలి?

ఔను.. ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డికి ఈ ప్ర‌శ్నే ఎదుర‌వుతోంది. మిమ్మ ల్ని ఎలా న‌మ్మాలండీ అంటూ.. తెలంగాణ స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. దీనికి కార‌ణం.. త‌న ఫోన్ కూడా ట్యాపిం గున‌కు గురైంద‌ని.. ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నా.. తాము వ‌దిలి పెట్ట‌బోమ‌ని.. బీజేపీ ప్ర‌భుత్వం కూసాలు క‌దిలిస్తుంద‌ని భారీ డైలాగులు పేల్చారు. అయితే, ఇప్ప‌టికీ కేంద్రంలో ఉన్న‌దిబీజేపీనే క‌దా.. మీరు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న‌ది జనం టాక్‌.

ఇంత‌కీ కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి పెట్టినా… బీజేపీ వదలదని అన్నారు.

అయితే.. అస‌లు కిష‌న్ రెడ్డి చెబుతున్న‌ట్టుగా ఆయ‌న ఫోన్ ట్యాప్ అయింది.. దుబ్బాక , హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అయితే.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏం చేశారు? కేంద్రంలో ఉన్న‌దిబీజేపీ ప్ర‌భుత్వ‌మే క‌దా.. మ‌రి అక్క‌డే చెప్పి.. అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ ఎస్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇదంతా చూస్తే.. కిష‌న్ రెడ్డిఏదో గేమ్ ఆడుతున్నార‌న్న వాద‌న అయితే.. బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago