ఔను.. ఇప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈ ప్రశ్నే ఎదురవుతోంది. మిమ్మ ల్ని ఎలా నమ్మాలండీ అంటూ.. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. దీనికి కారణం.. తన ఫోన్ కూడా ట్యాపిం గునకు గురైందని.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. తాము వదిలి పెట్టబోమని.. బీజేపీ ప్రభుత్వం కూసాలు కదిలిస్తుందని భారీ డైలాగులు పేల్చారు. అయితే, ఇప్పటికీ కేంద్రంలో ఉన్నదిబీజేపీనే కదా.. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది జనం టాక్.
ఇంతకీ కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి పెట్టినా… బీజేపీ వదలదని అన్నారు.
అయితే.. అసలు కిషన్ రెడ్డి చెబుతున్నట్టుగా ఆయన ఫోన్ ట్యాప్ అయింది.. దుబ్బాక , హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేశారు? కేంద్రంలో ఉన్నదిబీజేపీ ప్రభుత్వమే కదా.. మరి అక్కడే చెప్పి.. అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ ఎస్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనేది ప్రధాన ప్రశ్న. ఇదంతా చూస్తే.. కిషన్ రెడ్డిఏదో గేమ్ ఆడుతున్నారన్న వాదన అయితే.. బలంగా వినిపిస్తుండడం గమనార్హం. దీనిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…