వీహెచ్పీ.. విశ్వహిందూపరిషత్. ఈ పేరు వింటే.. అంటే కూడా.. వివాదాలకు కేంద్రం. నచ్చకపోయినా.. ఇది నిజం. ఇప్పుడు మరోసారి ఇది నిజమైంది. సింహాలకు పేర్లు పెట్టడాన్ని.. వీహెచ్పీ నిరసిస్తోంది. అంతేకాదు.. కోర్టుకు కూడా వెళ్లింది. ఈ చిత్రమైన వివాదం.. ఫైర్బ్రాండ్ నాయకురాలు.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది.
ఇదీ.. వివాదం!
పశ్చిమ బెంగాల్లో అటవీ శాఖ అధికారులు రెండు సింహాలను ఎన్ క్లోజర్లో పెట్టారు. ఇది సహజమే. ఎందుకంటే.. ఎంత జాతీయ జంతువైనా.. క్రూరత్వం వాటి లక్షణం కాబట్టి బంధించే ఉంచుతారు. దీనిని ఎవరూ తప్పుబట్టలేదు. అయితే.. ఈ సింహాల్లో ఒకటి మగది, రెండోది ఆడది. అయితే.. అధికారులు వీటిని ఒకే ఎన్క్లోజర్లో పెట్టి.. వాటికి పేర్లు పెట్టారు. మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని నామకరణం చేశారు.
అంతే.. దీనిపై వీహెచ్పీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.. పేర్లు పెట్టడం ఏంటి? అని నిలదీస్తున్నారు. రెండు కూడా హిందూ దేవతలకు సంబంధించిన పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు పలుమార్లు చెప్పి చూశారు. కానీ వారు దీనిని పక్కన పెట్టారు. ఎందుకంటే.. ఎక్కడైనా బీజేపీ, వీహెచ్పీ పప్పులు ఉడుకుతాయేమోకానీ.. మమత ఇలాకాలో వీరి ఆటలు సాగవు కదా!
దీంతో ఇప్పుడు వీహెచ్పీ నాయకులు ఏకంగా కోర్టుకు వెళ్లారు. బెంగాల్ సఫాయి పార్క్ డైరెక్టర్ను ప్రతివాదిగా పేర్కొంటూ.. జల్పాయిగుడీ కోర్టులో కేసు వేశారు. హిందువుల మనోభావాల మేరకు పేర్లు మార్చాలని.. ముఖ్యంగా మగ సింహం పేరును రాముడిగా పెట్టాలనేది వీరి డిమాండ్. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు సోమవారం విచారిస్తామని పేర్కొంది. మరి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇక, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వాదనలు వినిపిస్తారో కూడా చూడాలి.
This post was last modified on February 18, 2024 11:01 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…