విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎన్నడూ జరగని భారీ అగ్నిప్రమాదం జరిగిన వైనం ఏపీలో సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో వరుసగా ఒకదాని తర్వాత మరో బోటుకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టి దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
కళ్ళెదుటే తమ జీవనాధారం బూడిదవతుంటే మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ పేలి మంటలు మరింత తీవ్రంగా మారాయి. అయితే, ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఓటమి తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆకతాయిలు కొందరు కావాలనే బోట్లకు నిప్పుపెట్టి ఉంటారని మత్స్యకార బోట్ల సంఘ నాయకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితులను ఆదుకోవాలని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దాదాపు 40 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 20, 2023 2:13 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…