విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎన్నడూ జరగని భారీ అగ్నిప్రమాదం జరిగిన వైనం ఏపీలో సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో వరుసగా ఒకదాని తర్వాత మరో బోటుకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టి దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
కళ్ళెదుటే తమ జీవనాధారం బూడిదవతుంటే మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ పేలి మంటలు మరింత తీవ్రంగా మారాయి. అయితే, ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఓటమి తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆకతాయిలు కొందరు కావాలనే బోట్లకు నిప్పుపెట్టి ఉంటారని మత్స్యకార బోట్ల సంఘ నాయకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితులను ఆదుకోవాలని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దాదాపు 40 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 20, 2023 2:13 pm
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…