Trends

విశాఖ హార్బర్ లో ఆగ్ని ప్రమాదం..40 బోట్లు దగ్ధం

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎన్నడూ జరగని భారీ అగ్నిప్రమాదం జరిగిన వైనం ఏపీలో సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో వరుసగా ఒకదాని తర్వాత మరో బోటుకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టి దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

కళ్ళెదుటే తమ జీవనాధారం బూడిదవతుంటే మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ పేలి మంటలు మరింత తీవ్రంగా మారాయి. అయితే, ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ ఓటమి తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆకతాయిలు కొందరు కావాలనే బోట్లకు నిప్పుపెట్టి ఉంటారని మత్స్యకార బోట్ల సంఘ నాయకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాధితులను ఆదుకోవాలని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దాదాపు 40 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

2 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

2 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

4 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

4 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

4 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

5 hours ago